Netanyahu: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు
- ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
- ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు ప్రధాన శత్రువు ట్రంపేనని.. ఆయనను చంపాలని టెహ్రాన్ కురుకుంటోందని తెలిపారు. ట్రంప్ సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు అని పేర్కొన్నారు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ట్రంప్ ఇష్టపడరన్నారు. ఇక ప్రత్యర్థికి లొంగిపోరన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదనే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఇరాన్కు ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ను చంపాలని టెహ్రాన్ భావిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రపంచ దేశాలకు ఇరాన్ పెనుముప్పుగా మారుతోందన్నారు. ముప్పును తొలగించేంత వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Love: ఇచ్చిన మాట కోసం.. ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చూసింది. అణు స్థావరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఇరాన్లో స్వల్ప భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 2.5గా నమోదైంది. ఇక 14 మంది అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..
ఇదిలా ఉంటే ఖతార్, ఒమన్ మధ్యవర్తులుగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు సిద్ధపడ్డాయి. కానీ ఇరాన్ అందుకు అంగీకరించలేదు. ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు పాల్పడడంతో ఇరాన్ ఆగ్రహంగా ఉంది. ఇక ట్రంప్ కెనడా పర్యటనకు వెళ్లే ముందు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావాలని సూచించారు. అందుకు ఇరాన్ అంగీకరించలేదు.
4 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్లో మరణాల సంఖ్య పెరిగింది. 230 మంది చనిపోయారు. ఇందులు 90 శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 10 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!