Israel-Iran war: ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్.. ఇరాన్ ఘర్షణతో భయం..
- ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ మనమే కావచ్చు..
- భయపడుతున్న పాకిస్తాన్..
- ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో ఆ దేశ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran war: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనపరుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై వందలాది క్షిపణులతో దాడులు చేసింది. అయితే, ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్ని భయపెడుతున్నాయి. ఇజ్రాయిల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై ‘‘క్రూసేడ్’’ ప్రారంభించిందని, గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్పై దాడులు చేస్తున్నారని, తర్వాత హిట్ లిస్ట్లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది.
ఇటీవల పాకిస్తాన్ ఎంపీ అసద్ కైజర్ ఆ దేశ పార్లమెంట్లో చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్గా మారింది. ఇజ్రాయిల్ నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని, భారత్-ఇజ్రాయిల్ మధ్య సైనిక సహకారం ఇస్లామాబాద్కు అతిపెద్ద ముప్పు అని హెచ్చరించాడు. పాకిస్తాన్, ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయిల్ మనపై కూడా దాడి చేయగలదని హెచ్చరించారు.
Also Read
Read Also: Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
“ఇటీవల జరిగిన భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో, భారత దళాలు ఉపయోగించిన డ్రోన్లు, మందుగుండు సామగ్రిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ తయారు చేసినవే” అని ఆయన అన్నారు. “అల్లాహ్ దయ చూపాలి, ఇరాన్ తర్వాత, దాని (ఇజ్రాయెల్) తదుపరి లక్ష్యం పాకిస్తాన్ కావచ్చు” అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ మద్దతుగా నిలవాలని ఎంపీ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.
ఇజ్రాయిల్ భీకర దాడి:
ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తుందనే అనుమానంతో ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఇరాన్పై అత్యంత తీవ్రమైన దాడిని ప్రారంభించింది, శుక్రవారం నాడు రాజధాని టెహ్రాన్తో సహా ఇరాన్ నగరాలపై ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్(IRGC) చీఫ్ హోస్సేన్ సలామి, కమాండర్ గులామ్-అలీ రషీద్, అణు శాస్త్రవేత్త డాక్టర్ మొహమ్మద్ టెహ్రాన్చి, అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫెరేడూన్ అబ్బాసి, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరితో సహా అనేక మంది అగ్ర ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లను హతమార్చింది. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్పై దాడులు చేసింది.
తాజావార్తలు
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!