Israel-Iran war: ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్.. ఇరాన్ ఘర్షణతో భయం..
- ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ మనమే కావచ్చు..
- భయపడుతున్న పాకిస్తాన్..
- ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో ఆ దేశ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran war: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనపరుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై వందలాది క్షిపణులతో దాడులు చేసింది. అయితే, ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్ని భయపెడుతున్నాయి. ఇజ్రాయిల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై ‘‘క్రూసేడ్’’ ప్రారంభించిందని, గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్పై దాడులు చేస్తున్నారని, తర్వాత హిట్ లిస్ట్లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది.
ఇటీవల పాకిస్తాన్ ఎంపీ అసద్ కైజర్ ఆ దేశ పార్లమెంట్లో చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్గా మారింది. ఇజ్రాయిల్ నెక్ట్స్ టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని, భారత్-ఇజ్రాయిల్ మధ్య సైనిక సహకారం ఇస్లామాబాద్కు అతిపెద్ద ముప్పు అని హెచ్చరించాడు. పాకిస్తాన్, ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయిల్ మనపై కూడా దాడి చేయగలదని హెచ్చరించారు.
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
- Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
Read Also: Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
“ఇటీవల జరిగిన భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో, భారత దళాలు ఉపయోగించిన డ్రోన్లు, మందుగుండు సామగ్రిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ తయారు చేసినవే” అని ఆయన అన్నారు. “అల్లాహ్ దయ చూపాలి, ఇరాన్ తర్వాత, దాని (ఇజ్రాయెల్) తదుపరి లక్ష్యం పాకిస్తాన్ కావచ్చు” అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ మద్దతుగా నిలవాలని ఎంపీ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.
ఇజ్రాయిల్ భీకర దాడి:
ఇరాన్ అణ్వాయుధాలు నిర్మిస్తుందనే అనుమానంతో ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఇరాన్పై అత్యంత తీవ్రమైన దాడిని ప్రారంభించింది, శుక్రవారం నాడు రాజధాని టెహ్రాన్తో సహా ఇరాన్ నగరాలపై ఆపరేషన్ రైజింగ్ లయన్ కింద తెల్లవారుజామున వైమానిక దాడులు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్(IRGC) చీఫ్ హోస్సేన్ సలామి, కమాండర్ గులామ్-అలీ రషీద్, అణు శాస్త్రవేత్త డాక్టర్ మొహమ్మద్ టెహ్రాన్చి, అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫెరేడూన్ అబ్బాసి, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరితో సహా అనేక మంది అగ్ర ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లను హతమార్చింది. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్పై దాడులు చేసింది.
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!