PM Modi: కెనడా చేరుకున్న మోడీ.. జీ7 సదస్సుకు హాజరు
- కెనడా చేరుకున్న మోడీ
- 2 రోజుల పాటు పర్యటన
- జీ7 సదస్సుకు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఈరోజు, రేపు కెనడాలో పర్యటించనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తెగిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ కెనడాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ప్రపంచమంతా సర్వత్రా ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రధాని మోడీ 2019 నుంచి జీ7 సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Seven Hills Express: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తు్న్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్ గ్రామంలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు 2015 తర్వాత ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్న తొలి పర్యటన ఇది.
ఇది కూడా చదవండి: Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..!
జీ 7 సదస్సు సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్తో సహా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనే కొందరు నాయకులంతా ఒకచోట చేరనున్నారు. ప్రధానంగా ఈ సమ్మిట్లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. వాస్తవానికి భారత దేశం జీ7లో సభ్యత్వం లేదు. అయినా కూడా 2019 నుంచి మోడీకి ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రస్తుతం కెనడా ఆహ్వానం మేరకు వెళ్లారు. ఇక ఇటీవల భారతదేశం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో తొలిసారి మోడీ అంతర్జాతీయ పర్యటన చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని మోడీ లేవనెత్తే అవకాశం ఉంది.
జీ7 సమ్మిట్ అజెండా
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. అలాగే ట్రంప్ విధించిన సుంకాలు. భౌగోళికంగా చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!