పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది.
Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్బర్గ్ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్బర్గ్ ఫ్రాన్స్కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది" అని ఎక్స్లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గాజాలో మానవతా సాయం అందించేందుకు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ ఇటలీ నుంచి నౌకలో బయల్దేరి వెళ్లింది. అయితే ఆమెను గాజాలో ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి.
హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం ఆస్పత్రి సొరంగంలో లభ్యమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గత నెలలో మొహమ్మద్ సిన్వర్ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న ఈ నౌకలో థన్బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు.
దక్షిణ ఫ్రాన్స్లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్లతో కూడిన 19 ప్యాలెట్లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది.
గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు.
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 26 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.