IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్లో భారత్ తడబాటు.. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!
- తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఢీ
- సెమీస్ మ్యాచ్కు ముందు టీమిండియాకు కొత్త సవాల్
- భారత్ కోసం ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు వికెట్లు కోల్పోవడం సూర్య సేనను ఆందోళన కలిగిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో ఆడిన మ్యాచ్లో భారత్ 8 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. నమీబియాపై 8 ఓవర్లలో 61 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది. పాకిస్థాన్పై 18 ఓవర్లలో 144 పరుగులకు 7 వికెట్లు పడగా.. నెదర్లాండ్స్పై జట్టుపై 8 ఓవర్లలో 70 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై 4 ఓవర్లలో 29 పరుగులకు 4 వికెట్లు, వెస్టిండీస్పై 6 ఓవర్లలో 58 పరుగులకు 1 వికెట్, జింబాబ్వేపై 6 ఓవర్లలో 55 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. జింబాబ్వే, వెస్టిండీస్పై మినహా మిగతా మ్యాచ్లలో భారత బ్యాటర్లు స్పిన్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఈ గణాంకాలు భారత బ్యాటర్ల స్పిన్ బలహీనతను చూపిస్తున్నాయి.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
ముంబైలో సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లాండ్ను భారత్ ఎదుర్కోవాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు స్పిన్ దళంతో బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, జాకబ్ బెథెల్ వంటి ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్ బౌలింగ్లో భారత్ తడబాటును ఇంగ్లీష్ టీమ్ యూఏపీయోగించుకోనుంది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తే.. భారత్కు కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లో మధ్య ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం, స్ట్రైక్ రోటేట్ చేయడం ఇప్పుడు సూర్య సేనకు అత్యంత ముఖ్యం. భారత్ బ్యాటర్లు స్పిన్నర్లపై దూకుడుగా ఆడతారా? లేక జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తారా? అన్నది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. సెమీఫైనల్లో భారత్కు స్పిన్ బౌలింగ్ పెద్ద సవాల్గా మారనుంది. ఈ స్పిన్ పరీక్షను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!