Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు
- స్విట్జర్లాండ్లోని జెనీవాలో సమావేశం
- పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ జెనీవాకు చేరుకున్నారు. మంత్రితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. అమెరికా బృందం కూడా చేరుకుంది. ఈ చర్చల్లో పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. క్షిపణి కార్యక్రమంపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తొలి విడత చర్చలు ఒమన్లో జరిగాయి. అప్పుడు పెద్ద పురోగతి లభించలేదు. ఈసారైనా ఫలిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!
సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి జెనీవాలో యూఎన్ అణు వాచ్డాగ్ అధిపతితో సమావేశమయ్యారు. చర్చలకు ముందు సమావేశం జరిగినప్పటికీ అణు ఒప్పందంపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నట్లు ఇరువైపుల నుంచి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. ఇక చర్చలను అణు వరకే పరిమితం చేయాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది. క్షిపణితో పాటు ఇతర అంశాలపై చర్చించబోమని చెబుతున్నట్లుగా సమాచారం. జీరో-యురేనియం సుసంపన్నం, ఇతర కార్యక్రమాలపై చర్చించబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో జరిగే చర్చలు కూడా ఫలిస్తాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఇరాన్లో అశాంతి నెలకొనే పరిస్థితులు ఉంటాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!