Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు
- స్విట్జర్లాండ్లోని జెనీవాలో సమావేశం
- పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ జెనీవాకు చేరుకున్నారు. మంత్రితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. అమెరికా బృందం కూడా చేరుకుంది. ఈ చర్చల్లో పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
Also Read
- Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
- Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. క్షిపణి కార్యక్రమంపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తొలి విడత చర్చలు ఒమన్లో జరిగాయి. అప్పుడు పెద్ద పురోగతి లభించలేదు. ఈసారైనా ఫలిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!
సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి జెనీవాలో యూఎన్ అణు వాచ్డాగ్ అధిపతితో సమావేశమయ్యారు. చర్చలకు ముందు సమావేశం జరిగినప్పటికీ అణు ఒప్పందంపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నట్లు ఇరువైపుల నుంచి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. ఇక చర్చలను అణు వరకే పరిమితం చేయాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది. క్షిపణితో పాటు ఇతర అంశాలపై చర్చించబోమని చెబుతున్నట్లుగా సమాచారం. జీరో-యురేనియం సుసంపన్నం, ఇతర కార్యక్రమాలపై చర్చించబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో జరిగే చర్చలు కూడా ఫలిస్తాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఇరాన్లో అశాంతి నెలకొనే పరిస్థితులు ఉంటాయి.
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
-
Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!