US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం
- ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్
- టెహ్రాన్ అంతటా క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరు దేశాలు
- యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు
- ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెదిరించినట్టుగానే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. శనివారం ఇరాన్పై భీకర దాడులకు దిగాయి. టెహ్రాన్లో అధ్యక్షుడి కార్యాలయం సహా ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక నుంచి క్షిపణులు దూసుకుపోయాయి. దీంతో టెహ్రాన్లో అనేక చోట్ల భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్పై మొదలైన యుద్ధం.. టెహ్రాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
Also Read
ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడి కార్యాలయంపై క్షిపణులు విరుచుకుపడ్డాయని ఇరాన్ టీవీ ఛానల్స్ వెళ్లడించాయి. ఇక వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో అనేక మంది సైనికులు కూడా మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కార్యాలయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఖమేనీ ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో కూడా దాడులు జరిగాయి. దాడులకు ముందే ఖమేనీ బంకర్లోకి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్ధం వారు ప్రారంభించారు. ముగింపు మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Multiple explosions take place in Tehran pic.twitter.com/pgDjsWPJFt
— Press TV 🔻 (@PressTV) February 28, 2026
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!