Home
Ipl 2025
Ipl 2025 News
-
SRH vs HCA: ఐపీఎల్ 2025 టిక్కెట్ల వ్యవహారం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ!
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మధ్య కాంప్లిమెంటరీ టిక్కెట్ల (ఉచిత పాస్లు) వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో హెచ్సీఏ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని.. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వీడి మరో రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంటామని ఎస్ఆర్హెచ్ స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ వ్యవహారంపై… -
IPL 2025: రూ.23.75 కోట్లు అవసరమా?.. వెంకటేశ్ను ఆటాడుకుంటున్న ఫాన్స్!
డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2025లో నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఓ దాంట్లో గెలిచి, రెండింటిలో ఓడింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిన కేకేఆర్.. రెండో మ్యాచ్లో రాజస్థాన్పై గెలిచింది. ఇక సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 116 పరుగులకే ఆలౌట్ అయి.. 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కొత్త కెప్టెన్ అజింక్య రహానే సారథ్యం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు ఘోరంగా విఫలమైన… -
LSG vs PBKS: హార్డ్ హిట్టర్ల సమరం.. పరుగుల వరద ఖాయం! తుది జట్లు ఇవే
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో..… -
Hardik Pandya: ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు.. ఏకంగా బస్సులో! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ 31న దుబాయ్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్, నటాషాలు రాజస్థాన్లోని ఉదయ్పుర్ ప్యాలెస్లో రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో 2024… -
Rohit Sharma: రోహిత్ కాబట్టే ఇంకా టీంలో ఉన్నాడు.. హిట్మ్యాన్పై మాజీ కెప్టెన్ విమర్శలు!
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్లలో హిట్మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్తో ఇబ్బందిపడుతున్న రోహిత్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు… -
Suryakumar Yadav: టీ20 క్రికెట్లో సూర్యకుమార్ చరిత్ర.. మొదటి ఆటగాడిగా అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకున్న ఐదవ భారత ఆటగాడిగా సూరీడు నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ 9 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలు సూర్య కంటే ముందున్నారు. సూర్యకుమార్… -
Rohit Sharma: ముంబైకి తలనొప్పిగా రోహిత్ శర్మ.. 2020 నుంచి ఒక్కసారి మాత్రమే!
ఇటీవలి కాలంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్లో లేడు. టీమిండియా తరఫున అయినా, ఐపీఎల్లో అయినా అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. నిలకడగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ హిట్మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో 21 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్పై 8, చెన్నైపై 0, కోల్కతాపై 13 రన్స్ చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్లలో రోహిత్ ఫాస్ట్ బౌలర్కు వికెట్స్ ఇవ్వడం విశేషం. గత… -
Ashwani Kumar: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన అశ్వని కుమార్.. తొలి మ్యాచ్లోనే..!
ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్,… -
MS Dhoni: ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై చెన్నై కోచ్ ఏమన్నాడంటే?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తుండడంపై… -
IPL 2025: ఐపీఎల్లో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్కతా నైట్…
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!