Rohit Sharma: రోహిత్ కాబట్టే ఇంకా టీంలో ఉన్నాడు.. హిట్మ్యాన్పై మాజీ కెప్టెన్ విమర్శలు!
- ఐపీఎల్ 2025లో ఫామ్లో లేని రోహిత్ శర్మ
- మూడు మ్యాచ్లలో 21 పరుగులు మాత్రమే
- రోహిత్ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్లలో హిట్మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్తో ఇబ్బందిపడుతున్న రోహిత్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు ఉండుంటే ఈ పాటికే జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చేదన్నాడు.
క్రిక్బజ్తో మైఖేల్ వాన్ మాట్లాడుతూ… ‘కెప్టెన్, ఆటగాడిగా భారత్, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ముంబైని తిరుగులేని జట్టుగా నిలిపాడు. ప్రస్తుతం హిట్మ్యాన్ ముంబైకి కెప్టెన్ కాదు, కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడుతున్నాడు. ఒక్కసారి రోహిత్ గణాంకాలు పరిశీలిద్దాం. ఇవే పరుగులు మరో ఆటగాడు చేసి ఉంటే.. ఈ పాటికే జట్టులో స్థానం కోల్పోవాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు. హిట్మ్యాన్ అద్భుతమైన ఆటగాడు. అతడి నుంచి ఈ ప్రదర్శన సరికాదు. రోహిత్ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అతడు తిరిగి తన ఫామ్ అందుకోవాలి. ముంబై తరఫున భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది’ అని అన్నాడు.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
Also Read: Gold Rate Today: అయ్య బాబోయ్ ‘బంగారం’.. 93 వేలకు చేరుకున్న పసిడి!
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 నుంచి 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు 8 మాత్రమే ఉన్నాయి. హిట్మ్యాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105 నాటౌట్. 2024లో చెన్నైపై సెంచరీ చేశాడు. గత ఐదు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ ఒక్కసారి మాత్రమే 400 పరుగుల మార్కును అందుకున్నాడు. 2020లో 332, 2021లో 381, 2022లో 268, 2023లో 332, 2024లో 417 రన్స్ చేశాడు.
తాజావార్తలు
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?