గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు అమెరికా ప్రత్యేక సందేశాన్ని పంపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. న్యూయార్క్ హైవేపై భారతీయులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేయడంతో ఇరాన్లో భారీ నష్టం జరుగుతోంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్కు చెందిన గురాసిస్ సింగ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత…
హెచ్1బీ వీసా గురించి శోధిస్తున్న ప్రాంతాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఆ తరువాత స్థానాల్లో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
కరోనా మహమ్మారి తర్వాత, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గణనీయంగా పెరిగింది. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతిస్తున్నాయి.