Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్లో భారతీయుల ఆస్తులు
- విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల యత్నం
- ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్
- దాయపు పన్ను శాఖ విచారణలో బయటపడ్డ విషయం
- 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత ఆదాయపు పన్ను శాఖకు ఎటువంటి సమాచారం లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆస్తులను తప్పుదోవ పట్టించే ఆస్తులుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
ఢిల్లీలో లెక్కలు చూపని రూ.700 కోట్ల లావాదేవీలు..
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక్క ఢిల్లీ నుంచే రూ.700 కోట్లకు పైగా లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకారం.. డిపార్ట్మెంట్ యొక్క ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డజనుకు పైగా సోదాలు నిర్వహించింది. ఇందులో
ఒక్క ఢిల్లీలోనే రూ.700 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. విచారణ భారతదేశం అంతటా ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
జర్మనీ సమాచారాన్ని అందజేసింది..
ఇటీవల జర్మనీ మధ్యప్రాచ్యంలో భారతీయులకు చెందిన ఆస్తుల గురించి సమాచారాన్ని భారత్తో పంచుకుంది. వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అలాంటి సమాచారం జర్మనీ అధికారుల చేతికి ఎలా వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రూ.125 కోట్లకు పైగా నగదు పెట్టుబడి..
ఢిల్లీలో జరిగిన దాడుల్లో పన్ను చెల్లింపుదారులు రూ.125 కోట్లకు పైగా అప్రకటిత నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అధికారి తెలిపారు. ఈ దాడిలో నకిలీ నగదు చెల్లింపులు, రశీదులు, నకిలీ కొనుగోలు రశీదులు గుర్తించినట్లు ప్రజలు వెల్లడించారు. అక్టోబర్ చివరి నుంచి ప్రభుత్వం పంచుకున్న ఈ సమాచారం ఆధారంగా అనేక నోటీసులు జారీ చేయబడ్డాయి.
దోచుకున్న డబ్బే?
చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బును అక్రమంగా దుబాయ్కి తరలిస్తున్నట్లు ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏళ్లుగా అధికారంలో ఉంటూ.. అక్రమంగా సంపాధించిన డబ్బుతో అక్కడ భవనాలు, హోటళ్లు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాత వీటిపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి.!
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!