Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్లో భారతీయుల ఆస్తులు
- విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల యత్నం
- ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్
- దాయపు పన్ను శాఖ విచారణలో బయటపడ్డ విషయం
- 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత ఆదాయపు పన్ను శాఖకు ఎటువంటి సమాచారం లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆస్తులను తప్పుదోవ పట్టించే ఆస్తులుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
ఢిల్లీలో లెక్కలు చూపని రూ.700 కోట్ల లావాదేవీలు..
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక్క ఢిల్లీ నుంచే రూ.700 కోట్లకు పైగా లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకారం.. డిపార్ట్మెంట్ యొక్క ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డజనుకు పైగా సోదాలు నిర్వహించింది. ఇందులో
ఒక్క ఢిల్లీలోనే రూ.700 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. విచారణ భారతదేశం అంతటా ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
జర్మనీ సమాచారాన్ని అందజేసింది..
ఇటీవల జర్మనీ మధ్యప్రాచ్యంలో భారతీయులకు చెందిన ఆస్తుల గురించి సమాచారాన్ని భారత్తో పంచుకుంది. వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అలాంటి సమాచారం జర్మనీ అధికారుల చేతికి ఎలా వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రూ.125 కోట్లకు పైగా నగదు పెట్టుబడి..
ఢిల్లీలో జరిగిన దాడుల్లో పన్ను చెల్లింపుదారులు రూ.125 కోట్లకు పైగా అప్రకటిత నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అధికారి తెలిపారు. ఈ దాడిలో నకిలీ నగదు చెల్లింపులు, రశీదులు, నకిలీ కొనుగోలు రశీదులు గుర్తించినట్లు ప్రజలు వెల్లడించారు. అక్టోబర్ చివరి నుంచి ప్రభుత్వం పంచుకున్న ఈ సమాచారం ఆధారంగా అనేక నోటీసులు జారీ చేయబడ్డాయి.
దోచుకున్న డబ్బే?
చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బును అక్రమంగా దుబాయ్కి తరలిస్తున్నట్లు ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏళ్లుగా అధికారంలో ఉంటూ.. అక్రమంగా సంపాధించిన డబ్బుతో అక్కడ భవనాలు, హోటళ్లు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాత వీటిపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి.!
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!