Income Tax Department: ఇక్కడ దోచుకుంటున్నారు.. అక్కడ దాచుకుంటున్నారు.. దుబాయ్లో భారతీయుల ఆస్తులు
- విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల యత్నం
- ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్
- దాయపు పన్ను శాఖ విచారణలో బయటపడ్డ విషయం
- 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు భారతీయుల ఫేవరెట్ డెస్టినేషన్గా దుబాయ్ మారింది. కానీ.. దుబాయ్ ద్వారా చాలా పన్ను ఎగవేత జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. దుబాయ్లోని భారతీయుల అప్రకటిత స్థిరాస్తుల గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందింది. 500 కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తెలిసింది. వాటిపై ఇప్పుడు భారత్ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ దాచుకున్న ఆస్తుల గురించి భారత ఆదాయపు పన్ను శాఖకు ఎటువంటి సమాచారం లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆస్తులను తప్పుదోవ పట్టించే ఆస్తులుగా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
ఢిల్లీలో లెక్కలు చూపని రూ.700 కోట్ల లావాదేవీలు..
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక్క ఢిల్లీ నుంచే రూ.700 కోట్లకు పైగా లెక్కల్లో చూపని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకారం.. డిపార్ట్మెంట్ యొక్క ఢిల్లీ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డజనుకు పైగా సోదాలు నిర్వహించింది. ఇందులో
ఒక్క ఢిల్లీలోనే రూ.700 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. విచారణ భారతదేశం అంతటా ఉన్నందున.. ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
జర్మనీ సమాచారాన్ని అందజేసింది..
ఇటీవల జర్మనీ మధ్యప్రాచ్యంలో భారతీయులకు చెందిన ఆస్తుల గురించి సమాచారాన్ని భారత్తో పంచుకుంది. వెయ్యి మందికి పైగా భారతీయులకు చెందిన ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. అలాంటి సమాచారం జర్మనీ అధికారుల చేతికి ఎలా వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రూ.125 కోట్లకు పైగా నగదు పెట్టుబడి..
ఢిల్లీలో జరిగిన దాడుల్లో పన్ను చెల్లింపుదారులు రూ.125 కోట్లకు పైగా అప్రకటిత నగదు పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అధికారి తెలిపారు. ఈ దాడిలో నకిలీ నగదు చెల్లింపులు, రశీదులు, నకిలీ కొనుగోలు రశీదులు గుర్తించినట్లు ప్రజలు వెల్లడించారు. అక్టోబర్ చివరి నుంచి ప్రభుత్వం పంచుకున్న ఈ సమాచారం ఆధారంగా అనేక నోటీసులు జారీ చేయబడ్డాయి.
దోచుకున్న డబ్బే?
చాలా మంది రాజకీయ నాయకులు ప్రజల వద్ద దోచుకున్న డబ్బును అక్రమంగా దుబాయ్కి తరలిస్తున్నట్లు ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏళ్లుగా అధికారంలో ఉంటూ.. అక్రమంగా సంపాధించిన డబ్బుతో అక్కడ భవనాలు, హోటళ్లు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ పన్ను శాత వీటిపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి.!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..