Pahalgam Terror Attack: ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు.. జాతీయ జెండాలతో ఎన్నారైలు నిరసనలు
- ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తున్న ఆందోళనలు
- జాతీయ జెండాలతో ఎన్నారైలు నిరసనలు
- పహల్గామ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఎన్నారైలు జాతీయ జెండాలు చేత పట్టి నిరసనలు తెలిపారు. 400 మందికిపైగా కాశ్మీరీ పండితులు, మిత్రులు, స్నేహితులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా గళమెత్తారు.
ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
Also Read
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్లో భారతీయులంతా రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు జేశారు. జాతీయ జెండాలను పైకి ఎత్తి ఊపారు. ఇలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా నిరసనలు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో చనిపోయిన 26 కుటుంబాలకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: బీబీసీ తప్పుడు కథనాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కేంద్రం లేఖ
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
#WATCH | United Kingdom: Members of the Indian diaspora counter the Pakistani protest outside the Indian High Commission in London. #PahalgamTerroristAttack pic.twitter.com/woLKqFhE0E
— ANI (@ANI) April 27, 2025
తాజావార్తలు
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!