Israel-Iran War: ఇరాన్లో భారతీయులకు ఇక్కట్లు.. భారత్కు టెహ్రాన్ ఏం సూచించందంటే..!
- ఇరాన్లో భారతీయులకు ఇక్కట్లు
- భూసరిహద్దుల ద్వారా తీసుకెళ్లాలని టెహ్రాన్ సూచన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేయడంతో ఇరాన్లో భారీ నష్టం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Prabhas : రాజాసాబ్ టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
ఇక ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో తమను తీసుకెళ్లిపోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనపై ఇరాన్లోని భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థుల తరలింపునకు సహకరించాలని ఇరాన్ను భారతీయ ఎంబసీ కోరింది. అయితే ప్రస్తుతం ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. దీంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!
తాజాగా భారత అభ్యర్థనపై ఇరాన్ అధికారులు స్పందించారు. విమాన రాకపోకలు నిలిపివేసిన కారణాన భూసరిహద్దులు తెరిచి ఉన్నాయని.. ఆ దిశగా తీసుకెళ్లాలని ఇరాన్ సూచించింది. ఈ మేరకు టెహ్రాన్ అధికారులు వెల్లడించారు. సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ నంబర్లు, వాహన వివరాలను జనరల్ ప్రొటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారతదేశాన్ని కోరింది. దౌత్యవేత్తలు, ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. దాదాపు ఇరాన్లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్కు చెందినవారే ఉన్నారు.
టెహ్రాన్ సూచన మేరకు భారతీయ విద్యార్థులను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని భారత్ పేర్కొంది. ఇక ఇరాన్ నగరాల్లో చిక్కుకున్న వారు భయపడవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కోరింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!