Israel-Iran War: ఇరాన్లో భారతీయులకు ఇక్కట్లు.. భారత్కు టెహ్రాన్ ఏం సూచించందంటే..!
- ఇరాన్లో భారతీయులకు ఇక్కట్లు
- భూసరిహద్దుల ద్వారా తీసుకెళ్లాలని టెహ్రాన్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఏకధాటిగా దాడి చేయడంతో ఇరాన్లో భారీ నష్టం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Prabhas : రాజాసాబ్ టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Also Read
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
ఇక ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో తమను తీసుకెళ్లిపోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనపై ఇరాన్లోని భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థుల తరలింపునకు సహకరించాలని ఇరాన్ను భారతీయ ఎంబసీ కోరింది. అయితే ప్రస్తుతం ఇరాన్ గగనతలాన్ని మూసేసింది. దీంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: Tomato-Uji: ఊజీ ఈగ దెబ్బ.. టమోటాను పడేస్తున్న రైతులు!
తాజాగా భారత అభ్యర్థనపై ఇరాన్ అధికారులు స్పందించారు. విమాన రాకపోకలు నిలిపివేసిన కారణాన భూసరిహద్దులు తెరిచి ఉన్నాయని.. ఆ దిశగా తీసుకెళ్లాలని ఇరాన్ సూచించింది. ఈ మేరకు టెహ్రాన్ అధికారులు వెల్లడించారు. సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు, పాస్పోర్ట్ నంబర్లు, వాహన వివరాలను జనరల్ ప్రొటోకాల్ విభాగానికి ఇవ్వాలని భారతదేశాన్ని కోరింది. దౌత్యవేత్తలు, ఇతర పౌరుల సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. దాదాపు ఇరాన్లో 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం జమ్మూ కాశ్మీర్కు చెందినవారే ఉన్నారు.
టెహ్రాన్ సూచన మేరకు భారతీయ విద్యార్థులను తరలించేందుకు అధికారులు ఏర్పా్ట్లు చేస్తున్నారు. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని భారత్ పేర్కొంది. ఇక ఇరాన్ నగరాల్లో చిక్కుకున్న వారు భయపడవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కోరింది.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!