Huge Orders to Hyderabad Company: హైదరాబాద్లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
India set to become 3rd largest economy by 2030: ప్రపంచం అంతా మాంద్యం అంచున ఉంటే ఒక్క భారత్ మాత్రమే వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూకేను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది ఇండియా. రానున్న కాలంలో మరింత వేగంగా భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.…
India is the fifth largest economy, UK is sixth: అమెరికా, బ్రిటన్, చైనా ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల పరిస్థితి నెమ్మనెమ్మదిగా దిగజారుతోంది. దీంతో పాటు పలు దేశాలు మాంద్యం పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. మరికొన్ని దేశాలు శ్రీలంక పరిస్థితికి దగ్గర్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉంటే ఇండియాలో మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితులు వచ్చే అవకాశం దాదాపుగా ‘సున్నా’ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక…
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవేస్తారు.
మన ఎకానమీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పే సందర్భమిది. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే సంఘటిత రంగంలో 1149 ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్ వీటి విలువ ఏకంగా 104.3 బిలియన్ డాలర్లు కావటం విశేషం.
జూన్లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్లో గతేడాది జూన్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా…
భవిష్యత్తులో ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయం ఇంధనానికి మారాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు. పూణెలోని వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి షుగర్ కాన్ఫరెన్స్ 2022లో గడ్కరీ మాట్లాడారు. భవిష్యత్తులో వ్యవసాయ పరికారాల్లో కూడా ఇథనాల్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంధన, విద్యుత్ రంగాల్లో అవసరాలు తీర్చేందుకు ఏటా ఇండియా రూ. 10 లక్షల కోట్ల విలువైన పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో…
తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ శక్తులే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. దేశంలో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. డబ్బను పుట్టించడం మళ్లీ ఆ డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరగుపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని అన్నారు. రూ. 2 కిలో బియ్యం…