Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitharaman’s ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే భారతదేశం, కరెన్సీ చాలా మెరుగ్గా ఉందని ఆమె అన్నారు.
ఆర్బీఐ రూపాయి విలువను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. గత సోమవారం అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టస్థాయికి 82.68కి పడిపోయింది. జీ-20 భారత అధ్యక్ష పదవి తీసుకోవడంపై ఆమె మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్లు ఉన్న సమయంలో భారత్ ఈ బాధ్యతలు తీసుకుంటుందని ఆమె అన్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి విషయాలను జీ-20లో చర్చించాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
Read Also: Bihar: బీహార్లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
ఇటీవల ఐఎంఎఫ్ నుంచి భారత్ అభినందనలు అందుకున్న విషయంపై ఆమె స్పందించారు. భారతదేశం ఆధార్, డిజిటల్ విజయాలను గురించి మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇండియాలో డిజిటల్ లావాదేవీలపై మాట్లాడినట్లు వెల్లడించారు. భారత్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో జరుగుతున్న ఈడీ దాడులపై కూడా నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్వతంత్య్రంగా పనిచేసే సంస్థ అని అన్నారు. రాజకీయ ప్రతీకార ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈడీని వినియోగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు.
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!