PM Narendra Modi: సరిహద్దులు భద్రంగా.. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటేనే దేశం సురక్షితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
మేము ఎప్పుడూ యుద్ధాన్ని చివరి ఆప్షన్ గా భావిస్తాము. అది లంకలో జరిగానా.. లేక కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు దాన్ని నిరోధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని.. మేము ప్రపంచశాంతికి అనుకూలంగా ఉన్నామని పీఎం మోదీ అన్నారు. సైనికులను తన కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. వారు లేకుండా దీపావళి జరుపుకోనని.. సైన్యం ధైర్యసాహసాలను కొనియాడారు పీఎం మోదీ. కార్గిల్ విజయం లేనిదే పాకిస్తాన్ తో యుద్ధాన్ని చూడలేమని అన్నారు. ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ మన సైనికులు అత్యున్నత దైర్యానికి సాక్ష్యాలుగా నిలిచాయని.. కార్గిల్ లో మన సైనికులు ఉగ్రవాదాన్ని అణిచివేశారని ప్రధాని అన్నారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: John Shaw passed away: బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా భర్త కన్నుమూత
భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గౌరవంగా చూస్తుందని.. మీరు మన సరిహద్దులను రక్షించినప్పుడే..మనం మన శత్రువులపై కఠిన వైఖరి తీసుకుంటామని అన్నారు. మా సాయుధ దళాలు వారి సొంత భాషలో శత్రువులకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసని అన్నారు. భారతసైన్యం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సైనిక సామాగ్రిని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సరిహద్దులను రక్షించినప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని.. గత ఎనిమిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని అన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన పౌరులకు భారత జెండా రక్షణ కవచంగా నిలిచిందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దేశంలో నిర్మయాత్మక యుద్ధం జరుగుతోందని.. అవినీతిపరులు ఎంత శక్తివంతమైనవారైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. భారత సైన్యంలోకి మహిళలు రావడంపై‘‘ భారత సైన్యంలోకి మా కుమార్తెల రాకతో మా శక్తి పెరుగుతోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..