Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రసంస్థలు, పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పీఓకే నుంచి జమ్మూకాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ నుంచి ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టెర్రిస్టుల ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది.
IAF: రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దీని కోసమే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. యుద్ధవిమానాల దగ్గర నుంచి తుఫాకులు, ఫిరంగులు, హెలికాప్టర్లు ఇలా రక్షణ రంగంలో అవసరమయ్యే వాటిని ఇండియాలోనే తయారు చేసుకుని స్వావలంభన సాధించాలని కేంద్రం భావిస్తోంది.
Education: బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి అనుకునేవాళ్లు ఎందరో ఉన్నారు మనలో. కానీ కొందరు మాత్రం ఆర్మీలో ఉద్యోగం సాధించాలని.. దేశ సేవలో జీవితాన్ని సాగించాలని ఆరాట పడుతుంటారు. దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తుంటారు. అలా ఆర్మీలో ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ శుభ వార్త చెప్పింది. వివారాలలోకి…
వివరాలలోకి వెళ్తే.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ పశ్చిమ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన సెర్టో తంగ్తంగ్ కోమ్ ఆర్మీలో యువ సైనికునిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈమధ్యనే సెలవు పైన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో
Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు
Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ ఎన్కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.
Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్లో అనంత్నాగ్ ఎన్కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
Baramulla Encounter: బారాముల్లా ఎన్కౌంటర్ లో భద్రత బలగాలకు కీలక విజయం లభించింది. పీఓకే నుంచి ఇండియాలో చొరబడేందుకు ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శనివారం బారాముల్లాలోని ఊరీ సెక్టార్ లో ఎల్ఏసీ వెంబడి ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేశాయి.
Baramulla Encounter: గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. నలుగురు అధికారులు అమరులయ్యారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తూనే ఉంది. అయితే దట్టమైన అడవులు, గుహలు ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా శనివారం కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.