Sikkim Flood: సిక్కిం క్లౌడ్ బరస్ట్.. కూలిపోయిన 14 వంతెనలు.. చిక్కుకున్న 3000 మంది పర్యాటకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. 23 మంది సైనికులతో సహా 102 మంది గల్లంతయ్యారు. 26 మంది గాయపడినట్లు సమాచారం. అయితే, తప్పిపోయిన 23 మందిలో ఒక సైనికుడిని రక్షించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. వరదల కారణంగా 10వ నంబర్ జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. తీస్తా నది నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. సీఎం నుంచి పరిస్థితిపై ప్రధాని సమాచారం తీసుకున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కూడా సిక్కింలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 48 గంటల్లో సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్లను తెలుసుకుందాం.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
Read Also:Reliance Industries: రిలయన్స్ ఈవీ బ్యాటరీ వచ్చేసింది.. ఇంటి ఫ్యాన్లు, కూలర్లు కూడా రన్ అవుతాయి
సిక్కిం వరదలకు సంబంధించిన తాజా అప్డేట్లు…
* లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరద వచ్చింది.
* సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 3000 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
* వరదల కారణంగా 14 వంతెనలు కూలిపోయాయి. వీటిలో 9 బ్రిడ్జిలు బిఆర్ఓ పరిధిలో ఉండగా, 5 రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి.
* ఇప్పటి వరకు 166 మందిని రక్షించారు. వీరిలో ఆర్మీ జవాను కూడా ఉన్నారు.
* సింగ్టామ్లోని గోలిటార్ వద్ద తీస్తా నది వరద ప్రాంతం నుండి రెస్క్యూ సిబ్బంది అనేక మృతదేహాలను వెలికితీశారు.
* ప్రధాని మోడీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్తో మాట్లాడి రాష్ట్రంలో అకస్మాత్తుగా వరదల కారణంగా తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
* చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో సరస్సులో నీటిమట్టం ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది.
* బుధవారం ఉదయం తీస్తా నదిలో సింగటంలోని వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది.
* బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తీస్తా నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది.
* సిక్కిం ప్రభుత్వం నోటిఫికేషన్లో దీనిని విపత్తుగా ప్రకటించింది.
* సిక్కిం, ఉత్తర బెంగాల్లో మోహరించిన ఇతర భారతీయ ఆర్మీ సైనికులందరూ సురక్షితంగా ఉన్నారు.
* వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి తమాంగ్ సింగ్టామ్ను సందర్శించారు.
* నిరంతర వర్షాల కారణంగా రోడ్డు కింద రాళ్లు, మట్టి జారిపోవడంతో NH-10 యొక్క కొంత భాగం పడిపోయింది.
* గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు, తీస్తా నదిలో నీటిమట్టం పెరగడం వల్ల కాలింపాంగ్, డార్జిలింగ్, అలీపుర్దువార్, జల్పైగురి జిల్లాల్లో అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.
Read Also:Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే!
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..