Chandrababu and Pawan Kalyan: కూటమి ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: కూటమి ఎమ్మెల్యే ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఇంకా పూర్తిగా కోలుకున్నాం అని అనుకోవద్దని ఎమ్మెల్యే లకు సూచించారు… గుజరాత్ తరహాలో ఎప్పటికి అధికారంలో ఉండాలంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఈ రోజు కూటమి ఎమ్మెల్యే లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు.. తాజా రాజకీయ పరిణామాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించారు.. ఎమ్మెల్యేలు అందరూ అలెర్ట్ గా ఉండాలన్నారు. తాను సభ మొత్తం గమనిస్తా అన్నారు. సభ్యులు అందరూ అన్ని శాఖలపై పట్టు సంపాదించాలన్నారు.. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో… దీర్ఘ కాలం అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు.
మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగామని.. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందన్నారు.. అందుకే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టామన్నారు. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కారణం కేంద్ర సాయం అన్నారు చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సాయంతో నిలబెట్టాం. మన కోసం, మన ఏపీ కోసం, మన విశాఖ కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని సాయం చేసిందన్నారు.. ఇది చిన్న వ్యవహారం కాదన్నారు. కేంద్ర సాయంతో మొదటి సారి రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిందన్నారు చంద్రబాబు.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఫలితాలను ఇస్తున్నాయని.. మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దన్నారు చంద్రబాబు… కానీ, వ్యవస్థలను గాడిన పెట్టామని.. 20 నెలల్లో నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు.. ఇది ఎంతో మంచి పరిణామమని.. మన యూనిటీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో ఉండాలని… నిబద్ధత లేకపోతే ఫలితాలు రావన్నారు. వన్ టైమ్, టు టైమ్స్ ఉండిపోవడానికి సిద్దంగా లేమని.. గుజరాత్ లో 5 సార్లు బీజేపీ గెలిచిందన్నారు. ఆ తరహా ఫార్ములా ఇక్కడా అమలవ్వాలన్నారు.. మనలో విశ్వాసం ఉండాలని.. శాశ్వతంగా రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని.. ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు..
అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్ గా తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 9 నుంచి 1 గంట వరకు సభ్యులు అంతా సభలో ఉండాల్సిందే అన్నారు.. తాను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతానని… సభ్యుల ప్రసంగాలు వింటా… మంత్రులు సమాధానాలు చూస్తా అన్నారు.. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. మా సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలన్నారు. విప్లు సంతృప్తికరంగా పని చేయాలని.. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదన్నారు.. ప్రజల ఆమోదయోగ్యంగా సభ జరగాలన్నారు. మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం పెరిగిందని.. సంక్షేమ, అభివృద్ధితో 20 నెలల్లో మన బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. దీన్ని మీరంతా సానుకూలంగా తీసుకోవాలని… మరింత కష్టపడి పనిచేయాలన్నారు. చేసిన పనులకు ఎమ్మెల్యేలు ఓనర్షిప్ తీసుకోవాలని.. కేంద్రం చేసినా, రాష్ట్రం చేసినా ఓనర్షిప్ తీసుకోవాలని.. రెండు ప్రభుత్వాలు వేర్వేరు కాదని.. 20 నెలల్లో చాలా కష్టపడి ఐక్యంగా పనిచేశామన్నారు చంద్రబాబు.
ఇక, వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నాం అన్నారు.. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే మనం కలిసి ముందుకు వెళ్తాం అన్నారు.. రాష్ట్రం అభివృద్ది జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో.. భవిష్యత్లో అలాగే పనిచేయాలన్నారు. ఐక్యంగా ఉండి రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నారు. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని.. కూటమి ధర్మాన్నికి ప్రతి ఒక్కరం కట్టుబడి బడి పని చేద్దాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!