Anantnag encounter: “నేను బతకకపోవచ్చు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో”.. చివరిసారిగా భార్యకు వీడియో కాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు. కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ , జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. ముగ్గురు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఇటు ఆర్మీ, అటు పోలీసులతో పాటు యావత్ దేశ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్ చివరి మాటలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. తాను చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్య ఫాతిమాతో వీడియో కాల్ లో మాట్లాడారు.‘‘ తాను ఇక బతకకపోవచ్చని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని’’ తన కుటుంబానికి వీడియో కాల్ లో చెప్పారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
హుమాయున్ భట్ తన మ్యారేజ్ అనివర్సరీకి రెండు వారాల ముందు వీరమరణం పొందారు. తనకు కొడుకు జన్మించి కేవలం కొన్ని రోజుల మాత్రమే అయ్యాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్..నేను ఇక బతకను, నా గాయాలకు లొంగిపోతే, మా కొడుకును జాగ్రత్తగా చూసకోండి అంటూ తన భార్య ఫాతిమాతో మాట్లాడటం అందర్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి.
తాను ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి భట్ తండ్రితో మాట్లాడానని, మా రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయని, అతడిని కొండపై నుంచి కిందికి దించుతున్నామని, మేం ఏం చేస్తున్నామో అన్నింటిని భట్ తండ్రికి చూపించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. విపరీతమైన రక్తస్రావంతో డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు.
భట్ తండ్రి కూడా గతంలో జమ్మూకాశ్మీర్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేశారు. లష్కరేతోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఎలాగైనా తుదముట్టించాలని భద్రతబలగాలు కోకెర్ నాగ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!