Anantnag encounter: “నేను బతకకపోవచ్చు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో”.. చివరిసారిగా భార్యకు వీడియో కాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు. కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ , జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. ముగ్గురు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఇటు ఆర్మీ, అటు పోలీసులతో పాటు యావత్ దేశ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్ చివరి మాటలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. తాను చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్య ఫాతిమాతో వీడియో కాల్ లో మాట్లాడారు.‘‘ తాను ఇక బతకకపోవచ్చని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని’’ తన కుటుంబానికి వీడియో కాల్ లో చెప్పారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
హుమాయున్ భట్ తన మ్యారేజ్ అనివర్సరీకి రెండు వారాల ముందు వీరమరణం పొందారు. తనకు కొడుకు జన్మించి కేవలం కొన్ని రోజుల మాత్రమే అయ్యాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్..నేను ఇక బతకను, నా గాయాలకు లొంగిపోతే, మా కొడుకును జాగ్రత్తగా చూసకోండి అంటూ తన భార్య ఫాతిమాతో మాట్లాడటం అందర్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి.
తాను ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి భట్ తండ్రితో మాట్లాడానని, మా రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయని, అతడిని కొండపై నుంచి కిందికి దించుతున్నామని, మేం ఏం చేస్తున్నామో అన్నింటిని భట్ తండ్రికి చూపించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. విపరీతమైన రక్తస్రావంతో డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు.
భట్ తండ్రి కూడా గతంలో జమ్మూకాశ్మీర్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేశారు. లష్కరేతోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఎలాగైనా తుదముట్టించాలని భద్రతబలగాలు కోకెర్ నాగ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!