Canada: కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది. 2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు…
శ్రీలంక ముందు టీమిండియా 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకు వచ్చారు. అందులో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా ఆడిన పలు మ్యాచ్లకు ఎంకరేజ్ చేయగా.. మరోసారి తళుక్కుమంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరామెన్ సారాను చాలాసార్లు చూపెట్టాడు. ఎందుకంటే శుభమాన్ గిల్ క్రీజులో ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెగ ఎంకరేజ్ చేసిన సారా టెండూల్కర్..…
2023 ప్రపంచకప్లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 168వ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో టీమిండియా 98 మ్యాచ్ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య…
పంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.
Suryakumar Yadav in a never seen before avatar ahead of IND vs SA Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్ను గురువారం (నవంబర్ 2) శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం…
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా తీర్చిదిద్దాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశాన్ని మహిమాన్వితంగా తీర్చిదిద్దుతామని ఈ గడ్డపై ప్రమాణం చేస్తున్నానన్నారు. అంతకు ముందు దేశ నేలకు నమస్కరించి.. ప్రపంచంలోని గొప్ప నాగరికతలు అంతరించిపోయాయని, అయితే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఈ జాతిని కాపాడిన చైతన్యం భారత నేలకు ఉందన్నారు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్లాండ్కు వెళ్లవచ్చు. థాయ్లాండ్కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
2023 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్కప్ మ్యాచ్లకు ఫామ్లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది.