ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎస్ డిసెంబర్లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ప్రపంచకప్ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్ మ్యాచ్తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు.
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
United Nations: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన విచక్షణారహిత దాడితో ఆరంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆరంభించడం మీకు తెలుసు కానీ ఆపడం మాకు తెలియదు అన్నట్లు ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడులతో విరుచుకుపడుతుంది. ఇరు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలకి అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఈ మారణహోమాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్యసమితి తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మాన సభను UN…
Hardik Pandya Injury is impact on India team’s composition: స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్తో జరిగిన గత మ్యాచ్లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్ను బలోపేతం చేయడం కోసం శార్దూల్ ఠాకూర్పై…
చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశ కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది.
Qatar: ఖతార్లోని అక్కడి కోర్టు 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులకు కావాల్సిన న్యాయసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కోర్టు తీర్పు గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Jammu Kashmir: జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల…
Love Story: ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఇతర దేశాల నుంచి ఇండియాకు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే యువతి, యూపీలోని కుర్రాడి కోసం ఏకంగా సొంతదేశాన్ని వదిలి పిల్లలతో సహా ఇక్కడికి వచ్చింది. పబ్జీలో పరిచయమైన ఇద్దరు, క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇలాగే ఇండియాకు చెందిన ఓ వివాహిత, పాకిస్తాన్ అబ్బాయితో ప్రేమలో పడి అక్కడికి వెళ్లింది.
Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ దేశంపై పట్టుపెంచుకునేందుకు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఈ పరిణామం భారత్కి మింగుడుపడని అంశంగా మారింది.