Priyanka Gandhi: ఈ ఘటనపై సిగ్గుపడుతున్నా.. ఐరాస తీర్మానంపై భారత్ ఓటేయకపోవడంపై ప్రియాంకా గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఈ తీర్మానంపై ఓటింగ్ కి దూరంగా ఉంది. దీనిపై ఎక్స్(ట్విట్టర్)లో ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘‘ మానవత్వాన్ని తుడిచిపెట్టి, ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్, విద్యుత్ పాలస్తీనాలోని లక్షలాది ప్రజలకు నిలిపివేయబడినప్పుడు, మహిళలు, పిల్లల్ని నిర్మూలిస్తున్నప్పుడు మౌనంగా నిలబడి చూస్తుండటం, ఒకదేశంగా మనదేశం జీవితాంతం నిలబడిన ప్రతీదానికి వ్యతిరేకంగా ఉంది’’ అని పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ‘‘కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది’’ అని అన్నారు.
Also Read
Read Also: Kerala: పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు.. కేరళలో వివాదాస్పద ఘటన..
యూఎన్జీఏ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా మొదలైన 40 కన్నా ఎక్కువ దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి అనుకూలంగా 121 దేశాలు ఓటేయగా.. అమెరికా, ఇజ్రాయిల్ సహా 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఉక్రెయిన్, యూకే వంటి 43 దేశాలు ఓటింగ్ కి దూరంగా ఉన్నాయి. దీనిపై ఇజ్రాయిల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానాన్ని తిరస్కరించారు. ఇజ్రాయిల్ కి బదులుగా ‘‘నాజీ టెర్రరిస్టులకు రక్షణ’’ కొందరు ఎస్ అని ఓటేశారని విమర్శించారు.
“An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi
I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza.
Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?