ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
New Zealand PM: వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేది హోలీ పండగ. ఈరోజు (మార్చ్ 14) ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం ప్రజలతో కలిసి హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్. మధుమేహ చికిత్సకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ ధరలు భారీగా తగ్గాయి. అత్యంత చౌకగా మారాయి. డయాబెటిస్లో ఉపయోగించే ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ఔషధం పేటెంట్ గడువు ముగిసినందున భారత్ లో దాని ధర బాగా తగ్గింది. దీని ధర ఇప్పుడు దాదాపు 90 శాతం తగ్గింది. రూ. 60 నుంచి రూ. 5కి ట్యాబ్లెట్ ధరలు తగ్గిపోయాయి. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత దాని జనరిక్ మందులు మార్కెట్లోకి వచ్చాయి. Also Read:Delhi Capitals…
Pakistan Train Hijack: పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ హైజాక్కి గురైంది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఫైటర్స్ హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనక భారతదేశ హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది. ఈ హైజాక్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ ఫైటర్స్ చేతిలో మరణించారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది.
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్నారు. మంగళవారం పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం లభించింది. సోమవారం అర్ధరాత్రి మోడీ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలతో కొత్త అధ్యాయనం ప్రారంభించబోతున్నట్లు మోడీ పేర్కొన్నారు. బుధవరం మారిషస్ 57వ జాతీయ దినోత్సవం జరగనుంది. గౌరవ అతిథిగా మోడీ పాల్గొననున్నారు.