ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ప్రస్తుత టోర్నమెంట్లో వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించింది. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత అనంతరం ఫైనల్లో కూడా పాకిస్థాన్ను ఓడించాలని భారత్ చూస్తోంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడడం ఇదే మొదటిసారి కాబట్టి.. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్ మ్యాచ్పై భారత…
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దూబెలోని బౌలర్ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.…
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్…
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదానికి దారితీసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ సంజు శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్.. టీవీ అంపైర్కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ క్యాచ్ను సమీక్షించి ఔట్ ఇచ్చాడు. వికెట్ కీపర్…
ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు సోదరి కోమల్ శర్మ చెప్పారు. సెంచరీ కోసమే తాను వెయిటింగ్ చేస్తున్నానని వెల్లడించారు. అభిషేక్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దు అని తెలిపారు. అభిషేక్ ఆట చూడటం బాగుందని, దాయాది పాకిస్థాన్పై ఇన్నింగ్స్ను ఆస్వాదించాం అని అభిషేక్ తల్లి మంజు శర్మ చెప్పుకొచ్చారు. 2025 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ చెలరేగాడు. 39…
Gautam Gambhir: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఎన్నో అంచనాలు, ఉద్వేగాలు. అయితే, ఆసియా కప్ 2025లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్లు కేవలం ఆటపరంగానే కాకుండా.. మైదానం వెలుపల జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో, చివరికి అంపైర్లతో కూడా కరచాలనం చేయలేదు. ఈ చర్య పెద్ద వివాదానికి దారితీసింది. Surya Kumar Yadav:…
Sahibzada Farhan: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఆదివారం నాడు భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా అతని ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. Haris Rauf: ఛీ.. ఛీ..…
Haris Rauf: ప్రస్తుతం క్రికెట్లో భారత్తో పోటీపడి గెలవడం పాకిస్థాన్కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్లో భారత్పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో…
Asia Cup 2025: ఆసియా కప్లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్లో పాకిస్థాన్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు…