Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్కు ఇది…
PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు వార్తాపత్రికలను డెలివరీ చేయడాన్ని పాకిస్తాన్ నిషేధించింది. దీనిని పాకిస్తాన్ సంకుచిత మనస్తత్వం కలిగిన చర్యగా, వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి? దాని కింద ఏ హక్కులు ఇవ్వబడ్డాయి? ఆ వివరాలు మీకోసం.. స్వతంత్ర, సార్వభౌమ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి 1961లో వియన్నా సమావేశం మొదటిసారి జరిగింది. దీని కింద, దౌత్యవేత్తలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంతర్జాతీయ ఒప్పందానికి నిబంధన విధించారు.…
Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి,…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము చాలా విజయాలు సాధించాము. భారత్-పాకిస్తాన్ ఉన్నా్యి. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా-కాంగో ఉన్నాయి’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ రుట్టేతో జరిగిన సమావేశంలో అన్నారు.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.
Pakistan: పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాహుల్గాంధీపై అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్షా మరోసారి స్పందించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా…