Shahid Afridi: రాహల్ గాంధీపై షాహీద్ అఫ్రిది ప్రశంసలు, మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
- భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘హ్యాండ్ షేక్’’ వివాదం..
- మోడీ ప్రభుత్వంపై షాహీద్ అఫ్రిది విమర్శలు..
- రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్కు ఇది జరగాల్సిందే అని భారత ప్రజలు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, భారత్ మీద ఎప్పుడూ పడిఏడ్చే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడంపై స్పందించారు. భారత్ను విమర్శించారు. ఇదిలా ఉంటే, షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూ, మోడీ ప్రభుత్వాన్ని ‘‘హిందూ – ముస్లిం కార్డు ప్లే చేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ మోడీ ప్రభుత్వం మతం కార్డును ప్లే చేస్తోంది. అధికారంలోకి రావడానికి హిందూ-ముస్లిం కార్డు ప్లే చేస్తోందని నేను పదే పదే చెబుతున్నాను. ఇది చాలా చెడు మనస్తత్వం’’ అని ఆరోపించారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటివి కొనసాగుతాయి. రాహుల్ గాంధీ ఈ విధానంతో విభేదించారని, కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్తో సంభాషణను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ‘‘రాహుల్ గాంధీకి సానుకూల మనస్తత్వం ఉంది. చర్చల ద్వారా ఆయన అందరితో, మొత్తం ప్రపంచంతో కలిసి నడవాలని కోరకుంటున్నారు’’అని ఆఫ్రిది ప్రశంసలు కురిపించారు. ఆసియా కప్లో భారత ఆటగాళ్లు, పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాక్తో సంబంధాలు లేకుండా పోయాయి. నిజానికి ఈ మ్యాచ్ని భారత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నడూ లేనంతగా భారత్-పాక్ మ్యాచ్ అంటే కనీసం ఆసక్తి చూపించలేదు. ‘‘ఆసియా కప్ ప్రారంభమైనప్పుడు, భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. ప్రజల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, ఆటగాళ్లు, బీసీసీఐ మా జట్టుతో కరచాలనం చేయవద్దని చెప్పడంలో ఆశ్చర్యం లేదు’’ అని ఆఫ్రిది అన్నారు. ‘‘నేను భారత ఆటగాళ్లను తప్పుపట్టడం లేదు, కానీ వారికి పై నుంచి ఆదేశాలు ఉన్నాయి’’ అని అన్నారు.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!