Amit Shah: పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోంది.. అమిత్ షా ఆగ్రహం..
- ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు
- పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోంది
- ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాం
- నిజామాబాద్ రైతు సమ్మేళన సభలో అమిత్షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీపై అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్షా మరోసారి
స్పందించారు.
READ MORE: Amit Shah: కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారింది..
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారికి సూచించారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో పాకిస్థాన్కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా..? మీరే చెప్పండి అని జనాలను కేంద్ర మంత్రి అడిగారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని సూచించారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తు చేశారు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారన్నారు.
READ MORE: Peddi Reddy: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
“తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్కు పసుపుబోర్డు సాధించారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నాం. మోడీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది.” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!