ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్కు వైరస్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం ట్వీట్ చేసింది. దీంతో జూలై 1 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కు రోహిత్ దూరం కానున్నాడు. అటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు బుమ్రాకు ఇస్తారని ప్రచారం…
ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్తో ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 246/8 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, కోహ్లీ, అయ్యర్, గిల్ వంటి ప్రతిభావంతులు భారీ స్కోర్లు చేయలేనిచోట తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఒక్కడే టీమిండియా పరువు కాపాడాడు. అతడు 70 పరుగులతో రాణించడంతో భారత్ 200 పరుగులకు పైగా స్కోర్ చేయగలిగింది. కోహ్లీ (33), రోహిత్ (25),…
జూలై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊరట కలిగింది. కరోనా బారిన పడ్డ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా కోలుకున్నాడు. గురువారం లీసెస్టర్ షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ సెషన్లో అశ్విన్ పాల్గొన్న…
రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ…
గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఐదో మ్యాచ్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొందరికి కరోనా సోకిందన్న కారణంతో.. ఆ మ్యాచ్ని రద్దు చేసి, ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్ని రీషెడ్యూల్ చేశారు. జులై 1 – 5 మధ్య ఆ చివరి టెస్ట్ను నిర్వహించనున్నారు. ఇందుకు భారత జట్టుని బీసీసీఐ రీసెంట్గా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లైన అజింక్యా రహానె, ఇషాంత్…
ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల 8 నుండి ఇంగ్లాండ్ జట్టుతో ఎంతో ముఖ్యమైన యాషెస్ సిరీస్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు జట్టును కూడా ప్రకటించిన తర్వాత కొన్ని ఆరోపణల కారణంగా టిమ్ పైన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దాంతో జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపైన చాలా చర్చలు జరిగాయి. మళ్ళీ స్టీవ్ స్మిత్ కే కెప్టెన్సీ భాధ్యతలు ఇస్తారు అని కూడా వార్తలు వచ్చాయి.…
భారత్-ఇంగ్లాండ్ జాత్మ మంధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను మళ్ళీ నిర్వహిస్తారా… లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. దాదా మాట్లాడుతూ… ఈ 5 టెస్టుల సిరీస్ పూర్తిగా జరగాలి. ఇప్పటికే 2-1…
ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 4వ టెస్ట్ సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. అనంతరం టీం ఇండియా సహాయక సిబ్బందిలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో 5 వ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసారు. దాంతో భారత ఆటగాళ్లు అందరూ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో…
భారత్తో టెస్టు సిరీస్లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఐదవ మ్యాచ్ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడడంతో…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా.…