PV Sindhu: దుబాయ్లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu:మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్య ప్రయాణికులతో పాటు ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం, యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. ప్రతిష్ఠాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026’ టోర్నీలో పాల్గొనేందుకు పీవీ సింధు బ్రిటన్ (యూకే) బయలుదేరారు. దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన ఆమె విమానం.. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అక్కడే నిలిచిపోయింది. విమానాశ్రయం మూసివేతతో అధికారులు ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో సింధును ఎయిర్పోర్ట్ సమీపంలోని ఒక హోటల్కు తరలించారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ప్రస్తుతం హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నానని సింధు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు సమాచారం అందించారు.
READ ALSO: Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
విమానాశ్రయంలో విద్యార్థుల అవస్థలు..
మరోవైపు, మహారాష్ట్రలోని పుణేకు చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు సైతం దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. తమ ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ప్రాజెక్ట్ ముగించుకుని స్వదేశానికి బయలుదేరేందుకు నిన్న సాయంత్రమే వారు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాలు రద్దు కావడంతో వారు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్-అమెరికా భీకర పోరు ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం ఇప్పుడు బోసిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడమే కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు ఎక్కడికక్కడే వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 కారణాలే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!