మహిళల ప్రపంచకప్ 2025 రెండవ సెమీస్లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 29) నవీ ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సెమీస్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతమై ఉంటుందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది.…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది. సెమీఫైనల్లో అలైస్సా హీలీ…
వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా నేడు కాన్బెర్రాలో మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయినా.. ఇటీవలే ఆసియా కప్ 2025 గెలిచిన ఊపులో ఉండడం, జట్టు పటిష్టంగా కనిపిస్తుండడంతో సిరీస్ గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉండడంతో హోరాహోరీగా మ్యాచ్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్లో…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో…
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు. Also Read: 6 వేలకే…
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ కాన్బెర్రాలోని మనుకా ఓవల్లో బుధవారం రాత్రి జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. పొట్టి సిరీస్ అయినా పట్టాలని భారత్ భావిస్తోంది. మొదటి మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఎంపికకు టీ20…
టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్లో పక్కటెముకల్లో తీవ్ర గాయం కాగా.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో టీమిండియా మేనేజ్మెంట్ వెంటనే ఐసీయూకి తరలించింది. కనీసం వారం రోజుల పాటు శ్రేయస్ అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు చెప్పారట. బ్లీడింగ్ ఆగిపోయి, ఇన్ఫెక్షన్ కాకుంటే షిఫ్ట్ చేస్తామని మేనేజ్మెంట్కు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు ఆటకు శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది. Also Read:…
సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా…
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి…