Jemimah Rodrigues: అంతా దేవుడే చూసుకున్నాడు.. కన్నీటి పర్యంతమైన జెమీమా!
- నన్ను ఆ జీసస్ ముందుకు నడిపించాడు
- గత నాలుగు నెలలు కష్టంగా గడిచాయి
- ఇప్పుడు అంతా ఒక కలలా అనిపిస్తుంది
- కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 మహిళల వన్డే ప్రపంచకప్లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. సెమీస్లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 9 బంతులుండగానే ఛేదించింది. జెమీమా అజేయసెంచరీ (127: 134 బంతుల్లో 14 ఫోర్లు)తో మ్యాచ్ను గెలిచింది.
మ్యాచ్ అనంతరం జెమీమా రోడ్రిగ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ముందుగా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒంటరిగా ఈ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈరోజు నన్ను ఆ జీసస్ ముందుకు నడిపించాడు. అమ్మ, నాన్న, కోచ్, ఆత్మీయులు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గత నాలుగు నెలలు కష్టంగా గడిచాయి. ఇప్పుడు అంతా ఒక కలలా అనిపిస్తుంది. ఇంకా ముగియలేదు. ఫైనల్ మ్యాచ్ ఉంది. అందులో గెలిస్తేనే పరిపూర్ణం అవుతుంది. నేను 3వ స్థానంలో బ్యాటింగ్కు వస్తానని ముందుగా తెలియదు. స్నానం చేస్తున్నప్పుడు కూడా ఐదవ స్థానంలో ఆడతానని అనుకున్నా. కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు. వెంటనే సిద్దమయ్యా. నా కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలనుకోలేదు. ఈ మ్యాచ్లో గెలిపించి టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లాలనుకున్నా. ఈ రోజు సెంచరీ, హాఫ్ సెంచరీ గురించి ఆలోచించలేదు. జట్టును గెలిపించడం గురించే నా ఆలోచనలు తిరిగాయి’ అని జెమీమా తెలిపింది.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
Also Read: India Women’s Team: చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు.. పురుషుల వల్ల కూడా కాలేదు!
‘ఈరోజు నాకు అవకాశాలు (లైఫ్స్) వచ్చాయని తెలుసు. ఇదంతా ఆ దేవుడి దయ. సరైన ఉద్దేశ్యంతో పని చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు. గత ప్రపంచకప్ నుండి నన్ను తొలగించారు. ఈ సంవత్సరం జట్టులోకి వచ్చాను. కొన్ని విషయాలు మన పరిధిలో ఉండవు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా. ఈ పర్యటనలో నేను ప్రతిరోజూ ఏడ్చాను. మానసికంగా బాగా లేను, చాలా ఆందోళనగా ఉన్నా. ఈ టోర్నీ నాకు ఓ సవాలు. నేను చేయాల్సిందల్లా చేశాను. మిగతాది ఆ దేవుడు చూసుకున్నాడు. మాచుపై దృష్టి కేంద్రీకరించడానికి నాతోనే నేను మాట్లాడుకుంటూనే ఉంటా. నేను చాలా అలసిపోయాను. అయినా ఈరోజు జట్టు కోసం నిలబడాలనుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీవ్ర ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా అధిగమించేందుకు ప్రయత్నించా. భారత్ గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. మైదనంలో నా సహచరులు ప్రోత్సహించారు. అభిమానుల ప్రోత్సాహం ఉత్సాహపరిచింది’ అని జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
-
Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
-
Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..