IND Playing XI: కుల్దీప్, నితీష్ రెడ్డి ఔట్.. మొదటి టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- అక్టోబర్ 29న టీ20 సిరీస్ ప్రారంభం
- బుధవారం రాత్రి కాన్బెర్రాలో మొదటి మ్యాచ్
- మొదటి టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఇదే
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ కాన్బెర్రాలోని మనుకా ఓవల్లో బుధవారం రాత్రి జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. పొట్టి సిరీస్ అయినా పట్టాలని భారత్ భావిస్తోంది. మొదటి మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఎంపికకు టీ20 సిరీస్కు ఎంపిక కాలేదు. దాంతో ఒక మార్పు ఖాయం. బ్యాకప్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు. అతడు ఆడేది లేనిది ఇంకా తెలియరాలేదు. కాన్బెర్రాలోని మనుకా ఓవల్లోని పిచ్ బ్యాట్స్మన్లకు అనుకూలం. ఇక్కడ బౌన్స్, పేస్తో బంతి దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ పేస్ కోటాలో ఆడడం ఖాయం. మూడో ఫాస్ట్ బౌలర్గా హర్షిత్ రాణా ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే సిరీస్లో అత్యధిక వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్లో కూడా హర్షిత్ రాణించిన విషయం తెలిసిందే.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
Also Read: 7800mAh బ్యాటరీ, 50MP కెమెరా.. OnePlus Ace 6 ఫోన్లో మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్స్ భయ్యో!
ఆసియా కప్ 2025లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి) ఆడింది. మనుకా ఓవల్ పేస్ బౌలింగ్కు అనుకూలం కాబట్టి ఎవరు ఆడుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రౌండర్ అక్షర్ తుది జట్టులో ఉండడం ఖాయం. మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించగల సామర్థ్యం అతడికి కలిసిరానుంది. రెండవ స్పిన్నర్ స్థానానికి కుల్దీప్, వరుణ్ మధ్య పోటీ ఉంది. కుల్దీప్ 2018 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ఆడలేదు కానీ.. అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. వరుణ్ ఇంకా ఆసీస్ గడ్డపై ఆడలేదు. వరుణ్ ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగం పటిష్టం కావాలనుకుంటే నితీష్ ఆడనున్నాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబేలు బ్యాటింగ్ విభాగంలో ఆడనున్నారు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా/నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!