Home
Imd
Imd News
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం (జూన్ 6) ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపిస్తూ, వాతావరణం ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్మేసి, నగరం అంతటా దంచికొడుతూ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షంతో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో మండిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. నగరవ్యాప్తంగా వాన జల్లులు.. జలమయమైన రోడ్లు హైదరాబాద్లోని… -
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
Monsoon 2026: ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన భారతీయులకు నైరుతి రుతుపవనాలు చల్లని కబురు మోసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ కోట్లాది మందికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. గురువారం (జూన్ 4) కేరళను తాకిన ఈ పవనాలు, ప్రస్తుతం దక్షిణాది, తీరప్రాంతాల్లో విస్తరిస్తూ విస్తారంగా వర్షాలు కురిపిస్తున్నాయి. శనివారం (జూన్ 6) నాటికి కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటంతో రాబోయే రోజుల్లో ఇవి మరింత ఉత్తర దిశగా ప్రయాణించనున్నాయి. అయితే,… -
IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
IMD : ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నైరుతి రుతుపవనాలు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి… -
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
Heatwave Alert : తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్లోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది. అయితే రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసాధారణంగా పెరుగుతున్న ఈ వేడిని పరిగణనలోకి తీసుకున్న… -
Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. 4 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఓ వైపు చలి, పొగమంచుతో దేశం వణికిపోతుంటే.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆందోళనకు గురిచేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపనుంది. దీని వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య భారత్ లో తీవ్రమైన చలి, చలిగాలులు, దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. IMD ప్రకారం, రాబోయే 5-7 రోజులలో వాయువ్య భారతదేశం, బీహార్లలో, మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్,… -
Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా… -
Cyclone Ditwah: దిత్వా తుపాన్ ప్రభావం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు… -
AP Weather Report: మరో తుఫాన్ వచ్చేస్తోంది.. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఇటీవలే ‘మొంథా’ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొంథా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్గా మారాక సెన్యార్గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది. Also Read: YS Jagan: కడప జిల్లాలో మూడు… -
Heavy Rains: అమ్మబాబోయ్ మళ్లీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే రెండ్రోజులు దంచుడే దంచుడు
వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది. Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్… -
Cyclone Montha: విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం..
Cyclone Montha: ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ పెడుతోన్న మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను…
తాజావార్తలు
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!