Assam: అస్సాంను ముంచెత్తిన వరదలు.. 132 ఏళ్ల రికార్డ్ బద్ధలు
- అస్సాంను ముంచెత్తిన వరదలు
- 132 ఏళ్ల తర్వాత రికార్డ్ స్థాయిలో వర్షపాతం
- ఈశాన్య రాష్ట్రాల్లో 34 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. దీంతో 132 ఏళ్ల రికార్డ్ బద్ధలైంది. వాగులు, వంకలు అన్ని ఏకమయ్యాయి. ఇళ్లు, రహదారులు నీట మునిగాయి. అస్సాంలో రెండవ అతిపెద్ద నగరమైన సిల్చార్లో 24 గంటల్లో 415 మి.మీ వర్షపాతం నమోదైంది. 1893 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. అంటే జూన్ 1న 132 ఏళ్ల తర్వాత అతి పెద్ద వర్షపాతం నమోదైంది. 1893లో 290.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అటు తర్వాత అంతకు మించిన వర్షం ఆదివారం కురిసింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ఫైర్ బాంబ్ దాడి.. పలువురికి గాయాలు.. నిందితుడు పాలస్తీనా నినాదాలు
Also Read
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ద్రోణి కారణంగా అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఇక 2022లో బేత్కుండి దగ్గర బరాక్ నదిపై వాగు తెగిపోవడంతో సిల్చార్ నగరం వరదలను ఎదుర్కొంది. 90 శాతం పట్టణం మునిగిపోయింది. తాజాగా జూన్ 1న కురిసిన వర్షానికి మరోసారి మునిగిపోయింది.
ఇది కూడా చదవండి: Uppal: అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు.. బుద్ధి చెప్పిన పోలీసులు
గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఇక కొండచరియలు విరిగిపడడంతో 34 మంది చనిపోయారు. మే 31న మిజోరాంలో సాధారణం కంటే 1,102 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక మే 28 నుంచి జూన్ 1 వరకు గత ఐదు రోజులుగా మేఘాలయ అంతటా భారీ వర్షాలు కురిశాయి.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!