కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, నిన్న ఇవాళ మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర…
కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించాల్సిన జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 26వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించారు జూడాలు.. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ వైద్యులు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.. ఇక, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం…
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన…
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారు.. సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు లాక్డౌన్…
బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదోడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర… ఇవాళ మాత్రం నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.…
హైదరాబాద్ లో ఓ అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్న కొరియోగ్రాఫర్.. విషయం బయటపడటంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020లో షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమ్మాయి, అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు మనిప్రకాశ్. షూటింగ్ టైంలో అమ్మాయికి తెలికుండా కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేసిన మనిప్రకాష్..ఇద్దరి మధ్య…
హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరోనా…
కరోనా సమయంలో కొంతమంది అయినవారు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.. ఆదుకోవడానికి ముందుకు రావడం తర్వాత సంగతి.. కనీసం పలకరించడానికి కూడా వెనుకడుగే వేస్తున్నారు.. అయితే, ఈ సమయంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా కల్పించారు.. హైదరాబాద్లోని సైదాబాద్ ఎబ్బీఐ కాలనీకి చెందిన దంపతులు కరోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భర్త జగదీష్ కన్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వదిలారు..…
రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12…
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్డౌన్ సడలింపుల సమయంలోనే కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అసలు తమకు ఏదీ పట్టనట్టుగా చిన్నచిన్న కారణాలు చెప్పి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు కొందరు. దీంతో.. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేరకు పోలీసు అధికారులకు డీజీపీ…