హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కాపాలదారు కూతురు(13)పై జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care center)లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాధిత బాలిక…
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.…
కరోనా మహమ్మారి విరుచుకుపడుతోన్న సమయంలో.. ఎవ్వరైనా సరే తమకు ఏంటి? అన్నట్టుగా.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.. కొందరు లక్షలు చదివించినా.. తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు.. కనీసం బిల్లులు కూడా వేయకుండా.. వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేవారు కూడా లేకపోలేదు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. 24 నుంచి 48 గంటల్లో సమాధానం…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, మాసాయిపేట భూముల పై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును సవాల్ చేస్తూ ఈటల రాజేందర్…
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు……
గత బులెటిన్తో పోలిస్తే.. తెలంగాణ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,762 కొత్త కేసులు నమోదు కాగా, మరో 20 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,816 మంది కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,63,903కు చేరుకోగా.. రికవరీ కేసులు 5,22,082కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు 3,189 మంది మృతిచెందారు.. ప్రస్తుతం…
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులతో ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని..…
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నతమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రస్తుతం అత్యవసర సేవలు మినహా మిగతా విధుల బహిష్కరణ కొనసాగిస్తోంది తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్… అయితే, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేక పోవడంతో.. రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 10వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు జూడాలు… పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో పేర్కొన్నారు.. ప్రభుత్వం…
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల…
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని..…