హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ…
గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. మొదట అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. కానీ ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,850 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పెరిగి రూ.48,930 కి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు, తెలంగాణ శాసన మండలి ద్వారా 2020 సంవత్సరంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్థాపించబడింది. 200 ఎకరాలలో విస్తరించిన విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ విశ్వ విద్యాలయం పారిశ్రామిక ప్రయోజనకరమైన ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. నిరంతరం సరికొత్త విధానాలను అన్వేషిస్తూ, వాటిని అనుసరిస్తూ, నిరంతరాయంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నది.…
తెలంగాణలో రానున్న మరో మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.. రేపు,ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.. ఇక, రాగల మూడు రోజుల పాటు.. ఇవాళ, రేపు, ఎల్లుండి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని.. ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక, రాష్ట్రంలో నైరుతి…
త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ…
హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్…