నోటీసులు ఇవ్వకుండానే మా ఇళ్లను కూల్చి వేస్తున్నారంటూ గోపన్ పల్లి స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేసేందుకు సమ యం అడిగిన ఇవ్వకుండా కూల్చి వేశారని బాధితులు వాపో యారు. 40,50 ఏళ్ల నుంచి ఇక్కడే బతుకుతున్నామన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇళ్లను కానీ, నగదును కానీ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ మాట్లాడుతూ.. గోపన్పల్లి- తెల్లపూర్ మధ్యలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. ఇది ప్రభుత్వ స్థలమని గతంలోనే నోటీసులు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు2021లో జూన్ లో ఫైనల్ నోటీసులు ఇచ్చిన స్థానికుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కేవలం 10మందికి మాత్రమే డాక్యుమెంట్స్ ఇచ్చారు. వారి బ్యాంకుల్లో డబ్బులు కూడా జమ చేసినట్టు ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. 1.6 కిలో మీటర్ల వరకు రోడ్డు వేస్తున్నాము మొత్తం 8,400sq లో రోడ్డు నిర్మాణ పనులు చేపడు తున్నట్టు ఆమె వెల్లడించారు. ఆర్డీఓ, ఎమ్మార్వో, ఆర్ అండ్బీ అధికారులు రోడ్డు విస్తరణ పనులకు సిద్ధం అయ్యారు.