బస్సులో చిల్లర మరిచిపోయిన యువకుడు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రూ.100, రూ.500 ఇస్తే కండక్టర్ టిక్కెట్ డబ్బులు పోను చిల్లర తర్వాత ఇస్తానని టిక్కెట్ మీద రాసిస్తుంటాడు. కానీ కొంతమంది బస్సు దిగే హడావిడిలో చిల్లర సంగతి మరిచిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఓ విద్యార్థి కూడా ఇలాగే చిల్లర తీసుకోవడం మరిచిపోయాడు. అయితే ఓ ట్వీట్ ద్వారా ఆ డబ్బులను వెనక్కి పొందడం విశేషం. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 4వ తేదీ గురువారం నాడు సీతాఫల్మండికి చెందిన బాలరాజు అనే విద్యార్థి బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. రూ.20 టిక్కెట్ కోసం రూ.100 నోటును కండక్టర్కు ఇచ్చాడు. తన దగ్గర చిల్లర లేకపోవడంతో బస్సు దిగేటప్పుడు అడిగి తీసుకోవాలని చెప్తూ.. టిక్కెట్ వెనుక రూ.80 అని కండక్టర్ రాసిచ్చాడు.
Read Also: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
అయితే తన గమ్యస్థానం రాగానే బాలరాజు చిల్లర తీసుకోకుండానే బస్సు దిగేశాడు. అనంతరం అతడికి చిల్లర విషయం గుర్తుకురావడంతో తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ తన బాధను ట్వీట్ ద్వారా వెల్లడించాడు. విద్యార్థి ట్వీట్కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించి జీడిమెట్ల డిపో మేనేజర్తో మాట్లాడారు. దీంతో సదరు విద్యార్థికి చెల్లించాల్సిన రూ.80 నగదును శనివారం ఫోన్ పే చేసినట్లు జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్రెడ్డి వెల్లడించారు. కాగా ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ, డిపో మేనేజర్లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!