బస్సులో చిల్లర మరిచిపోయిన యువకుడు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో రూ.100, రూ.500 ఇస్తే కండక్టర్ టిక్కెట్ డబ్బులు పోను చిల్లర తర్వాత ఇస్తానని టిక్కెట్ మీద రాసిస్తుంటాడు. కానీ కొంతమంది బస్సు దిగే హడావిడిలో చిల్లర సంగతి మరిచిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఓ విద్యార్థి కూడా ఇలాగే చిల్లర తీసుకోవడం మరిచిపోయాడు. అయితే ఓ ట్వీట్ ద్వారా ఆ డబ్బులను వెనక్కి పొందడం విశేషం. వివరాల్లోకి వెళ్తే… ఈనెల 4వ తేదీ గురువారం నాడు సీతాఫల్మండికి చెందిన బాలరాజు అనే విద్యార్థి బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. రూ.20 టిక్కెట్ కోసం రూ.100 నోటును కండక్టర్కు ఇచ్చాడు. తన దగ్గర చిల్లర లేకపోవడంతో బస్సు దిగేటప్పుడు అడిగి తీసుకోవాలని చెప్తూ.. టిక్కెట్ వెనుక రూ.80 అని కండక్టర్ రాసిచ్చాడు.
Read Also: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
- Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప సంస్కారం.. భట్టి ప్రశంసలు
అయితే తన గమ్యస్థానం రాగానే బాలరాజు చిల్లర తీసుకోకుండానే బస్సు దిగేశాడు. అనంతరం అతడికి చిల్లర విషయం గుర్తుకురావడంతో తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ తన బాధను ట్వీట్ ద్వారా వెల్లడించాడు. విద్యార్థి ట్వీట్కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించి జీడిమెట్ల డిపో మేనేజర్తో మాట్లాడారు. దీంతో సదరు విద్యార్థికి చెల్లించాల్సిన రూ.80 నగదును శనివారం ఫోన్ పే చేసినట్లు జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్రెడ్డి వెల్లడించారు. కాగా ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ, డిపో మేనేజర్లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!