గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. మనసు ఒక చోట మనిషి మరో చోట అన్నట్టు ఉంది అయన పరిస్థితి. ప్రస్తుతం ఆయన తనలో తాను స్ట్రగుల్ అవుతున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట పరిశీలకులకు. తానొకటి తలుస్తుంటే వెనకున్న శక్తులు మరోటి చేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు.
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?. చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15…
కేటీఆర్ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్ను కలిశానన్న ఆయన.. కేటీఆర్ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
లంచగొండి అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా లంచాలకు చేతులు చాపుతున్నరు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవలందించాల్సిందిపోయి లంచాలు ఇవ్వాలని పీడిస్తున్నారు. లంచాలు పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. తాజాగా మరో అధికారిని లంచం తీసుకుంటూ దొరికిపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. Also Read:Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా? ఈ సోదాల్లో…
చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆదమరిచి ఉంటే అంతే సంగతులు. ఓ ముఠా పిల్లలే టార్గెట్ గా నగరంలో సంచరిస్తోంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వాచ్మెన్ పిల్లలను టార్గెట్ చేసుకోనీ ఎత్తుకెళ్లేందుకు రెడీ అయ్యింది ముఠా. అప్రమత్తమైన స్థానికులు ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పిల్లలను అపహరించే గ్యాంగుకు దేహశుద్ధి చేశారు. కాగా ముటా సభ్యులలో ముగ్గురిలో ఇద్దరు ఆటోలో తప్పించుకోగా ఒకరు పట్టుబడ్డారు. పట్టుకున్న మహిళను స్తంభానికి కట్టేసి కొట్టి…
సోషల్ మీడియా ఓ దొంగను పట్టుకోవడంలో కీలకంగా మారింది. ఆటోను చోరీ చేసిన ఓ దొంగను వాట్సాప్ గ్రూప్ పట్టించింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురవడంతో.. వాట్సప్ గ్రూప్ లో విషయాన్ని పోస్ట్ చేశాడు ఆటో ఓనర్. విషయం చక్కర్లు కొడుతూ పలు వాట్సప్ గ్రూపుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ చోరీకి గురైన ఆటోను బంజారాహిల్స్ లో గుర్తించాడు. ఆటో కి స్టిక్కర్లు తొలగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా…
ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్గానే నడుస్తోంది. స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్లో.