మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి.
అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బీహార్కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్లో నివాసం ఉంటున్నాడు. అమృత…
వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. హైదరాబాద్ సరూర్నగర్లో ఓ భార్య వేసిన స్కెచ్కు భర్త ఊపిరి ఆగిపోయింది. ప్రియుడితో కలిసి చంపేసి.. అనంతరం ‘భర్త పడుకుని ఇంకా లేవడం లేదని’ డ్రామా ఆడింది కిలాడి. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారానికి చెందిన జల్లెల శేఖర్.. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం…
ఆర్ధిక ఇబ్బందులు.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అప్పుల ఊభిలో చిక్కుకుపోయి.. గతంలో కొన్ని కుటుంబాలు సైతం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్లో ఆర్ధిక ఇబ్బందులకు మరో కుటుంబం విచ్ఛిన్నమైంది. భార్య, భర్త బలవన్మరణానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ జరిగింది. భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రి పాలైంది. అసలు కూకట్పల్లి కేసులో ఏం జరిగింది? ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రామకృష్ణ. ఆయనకు 20 ఏళ్ల…
నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అయి ఉండొచ్చు అనుకుంటే పొరపాటే.. మరి ఎందుకు చంపేసిందని ఆలోచిస్తున్నారా? అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తలిద్దరు చనిపోదామనుకున్నారు. ఈ క్రమంలో మొదట భర్త గొంతు కోసం చంపేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమ్యకృష్ణ, రామకృష్ణ దంపతులు. వీరు కెపిహెచ్బిలో నివాసముంటున్నారు. Also Read:Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం…
బైక్తో కారును చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్! పోనీ యువకుడిదే తప్పా అంటే.. అదీ కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే.. అక్కడే ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డ్యాష్ ఇస్తావా అంటూ క్రికెట్ బ్యాట్లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఊరుకోలేదు.. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆ గ్యాంగ్ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన…
హైదరాబాద్లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం.…
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది.…