టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీమనికి అలవాటు పడి సరికొత్త ఎత్తుగడలతో మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది.
CM Revanth Reddy : హైటెక్ సిటీలో CII జాతీయ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ CII గ్రీన్ బిజినెస్ సెంటర్లో సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్…
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్ఎన్ రెడ్డి నుండి హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్…
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా…
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా.. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
Software Engineer Suicide: ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పలువురు కుటుంబ సభ్యలు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఇప్పటికీ చాలా మందిలో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓ మోజు. లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయని, కార్లు, అపార్ట్మెంట్లు ఇలా అన్ని భోగాలు అనుభవిస్తారని అనుకుంటారు.
Ponnam Prabhakar : అమీర్ పేట్ CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు, రోగులు, రోగుల బంధువులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్పిటల్కి ప్రతిరోజూ వస్తున్న ఓపీలు ఎన్ని, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని, ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూతులు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ సూపరిండెంట్ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలాజీ విభాగాన్ని పరిశీలించారు.. ప్రభుత్వ హాస్పిటల్…