ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
భాగ్యనగరంలో మరో వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఆరాంఘర్- జూపార్కు ఫ్లై ఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్... అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు. అయితే.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది.
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్ను సౌకర్యవంతంగా అందిస్తుంది. PM Modi: 8న…
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన నంద కిశోర్, గోవింద్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్ల్లో తొంగిచూసినట్లు గుర్తించారు.
హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు.