Drunken Drive : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడికి ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విధించబడింది. తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒక గర్భిణీ మహిళ, ఆమె కడుపులో ఉన్న శిశువు మరణానికి కారణమైన ఈ ఘటనపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన ఈ విషాదకర ఘటనలో, ఓరుగంటి సుభాష్ (43), వృత్తి ఆటో డ్రైవర్, హయత్నగర్ పరిధిలోని కుంట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి,…
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు.
Fire Accident : హైదరాబాద్లోని కోకాపేట GAR టెక్ పార్క్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో వందలాది మంది ఉద్యోగులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకొని…
మన దేశంలో పెద్ద నోట్లు పూర్తిగా రద్దు అయిపోయినాయి ..ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న నోట్లో కనబడుతున్నాయి.. అందులో 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి ..ఎవరి దగ్గర చూసినా చిన్న నోట్ల కంటే 500 రూపాయలు నోట్లు ఎక్కువగా ఉంటాయి.. చిల్లర నోట్లు అసలు కనబడకుండా పోయినాయి.. ఈ 500 నోట్ల చలామణిలో అసలు నోట్లు ఎంత నకిలీ నోట్లు ఎంత అనేది ఎవరికీ తెలియదు ..ఎందుకంటే నకిలీ నోట్లో తయారుచేసి చాలా మంది…
Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు…
స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది.
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయారు.
భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్తో ఓటీఎస్ అవకాశం కల్పిస్తుంది. బకాయిదారులకు బల్దియా ఓటీఎస్ అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తించనుంది.
రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బహుదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్పుర x రోడ్డులోని లారీ మెకానికల్ వర్క్ షాపులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మెకానికల్ వర్క్…
పంజాగుట్టలోని ఓ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాన్బాగ్ హోటల్లోని ఐదో అంతస్తులో మంటలు ఎగసి పడ్డాయి. కిచెన్లోని తందూరి రోటీ బట్టీలోని చిమ్మిలో ఆయిల్ పేరుకు పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.