Real Estate Scam: అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో కుచ్చుటోపీ.. మరో రియల్ ఎస్టేట్ ఘరానా మోసం వెలుగులోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Estate Scam: పొట్ట చేత పట్టుకొని పొరుగు రాష్ట్రానికి కూలి పనులకు వెళ్లిన అతను కోట్లకు పడగలెత్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగాడు. ఓ మాఫియా డాన్ కు బినామిగా వ్యవహరించాడు అనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో జనానికి కుచ్చు టోపీ పెట్టి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? కోట్ల రూపాయల ఆస్తులకు ఎలా పడగలెత్తాడు..? ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తాకట్టులోన బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది.
Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?
Also Read
- Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
- Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
- BJP Protest: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాట.. తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.!
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
కొమ్మూరి కోల్ హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టింది త్రిపురా కన్స్ట్రక్షన్స్. దీంతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్ అతని భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సుధాకర్ కూతురు అల్లుడు పరారీలో ఉన్నారు. ఇంతకీ ఎవరి పసుపులేటి సుధాకర్? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని ఆరా తీస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నెల్లూరు జిల్లా కావలకు చెందిన పసుపులేటి సుధాకర్ ఐదవ తరగతి వరకే చదువుకున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా సెంట్రింగ్ మేస్త్రిగా పని చేశాడు. నెల్లూరులో బతకలేక తెలంగాణకు మకాం మార్చాడు. ఇళ్ల నిర్మాణంలో కిటుకులు నేర్చుకున్నాడు. అంచలంచలుగా ఎదిగాడు. త్రిపురా కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెట్టాడు. కోట్ల రూపాయలు కళ్ళరా చూశడు. కావలిలో 100 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు. డబ్బుకు కొదువ లేదు. కాబట్టి పొలిటీషియన్ కావాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీకి చకచక పావులు కదిపాడు.
Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!
2019లో జనసేనలో చేరిన సుధాకర్ కావలి నియోజక వర్గం నుంచి పోటీ చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గెలవలేకపోయాడు. తిరిగి హైదరాబాద్ కు చేరుకొని కొద్ది రోజులు బీజెపీలో చేరాడు. తర్వాత కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తానంటూ టీడీపీ, వైసీపీ ముఖ్యనేతలతో లాబీయింగ్ చేశాడు. కానీ అవేవి పని చేయలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే డిపాజిట్ కూడా రాలేదు. 2019, 2024 ఎన్నికల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సుధాకర్. అప్పటివరకు తాను సంపాదించిన దానితో పాటు ప్లాట్ల పేరుతో జనం నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఎన్నికలలో ఖర్చు పెట్టేసాడు. దీనితో ఇంకేముంది జనం ముందు దోషిగా నిలబడ్డాడు. పసుపులేటి సుధాకర్ పై గతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంకి బినామిగా పని చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కొందరు ప్రముఖ రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకొని త్రిపురా కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే ప్లాట్ల విక్రయాల్లో జనం నెత్తిన కుచ్చుటేపి పెట్టేసాడు. దీంతో లబోదిబో అంటున్నారు బాధితులు.
తాజావార్తలు
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
-
Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!