Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా?
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్పేట్లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది?
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్కు రింకూ సింగ్ దూరం..!
Also Read
హైదరాబాద్ అంబర్ పేట్ లోని బాపూజీ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారు. మృతులను రామ్రాజ్, మాధవి, శశాంక్గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట్లో ల్యాండ్మార్క్ హోటల్ యజమాని రామ్రాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా అంబర్పేట్లోనే నివాసం ఉంటున్నారు. సొంతిల్లు.. పెద్ద భవనం.. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. కానీ ముగ్గురు సూసైడ్ చేసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
రామ్ రాజ్ ముందు భార్య మాధవిని చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామ్రాజ్ కుమారుడు శశాంక్ తన ఎడమ చేయి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతను చనిపోకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు రామ్రాజ్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆస్తులు మొత్తం తన కూతురికేనంటూ వీలునామా కూడా రాసినట్లు సమాచారం.
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
ప్రస్తుతం రామ్రాజ్ కూతురు అమూల్య కొంపల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. రామ్రాజ్ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ దిశగా కూడా విచారణ చేస్తామని చెప్పారు పోలీసులు. ల్యాండ్మార్క్ హోటల్ యజమాని కుటుంబం మృతిపై రామ్రాజ్ అన్న జగదీశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని, తమది వెల్ సెటిల్డ్ కుటుంబం అని చెప్పారు. తమకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు జగదీష్. నా తమ్ముడు ఫ్యామిలీ సూసైడ్ ఎందుకు చేసుకున్నారో.. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కంటతడి పెట్టారు.
మరోవైపు తెల్లవారు 3 గంటల 15 నిమిషాలకు రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్లో సూసైడ్ చేసుకున్నామని మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యభర్తలు ఇద్దరు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రవి. రామ్ రాజ్.. అంబర్పేట్లో ల్యాండ్ మార్క్ హోటల్, మల్లేపల్లిలో బిరియాని సెంటర్, మల్లాపూర్లో కింగ్స్ హోటల్, చక్రిపురంలో మరొక హోటల్ నిర్వహిస్తున్నారు. ఐతే ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపడితే చనిపోయారా? ఎవరైనా భయపెట్టారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!