Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్పేట్లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది?
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్కు రింకూ సింగ్ దూరం..!
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
హైదరాబాద్ అంబర్ పేట్ లోని బాపూజీ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారు. మృతులను రామ్రాజ్, మాధవి, శశాంక్గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట్లో ల్యాండ్మార్క్ హోటల్ యజమాని రామ్రాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా అంబర్పేట్లోనే నివాసం ఉంటున్నారు. సొంతిల్లు.. పెద్ద భవనం.. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. కానీ ముగ్గురు సూసైడ్ చేసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
రామ్ రాజ్ ముందు భార్య మాధవిని చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామ్రాజ్ కుమారుడు శశాంక్ తన ఎడమ చేయి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతను చనిపోకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు రామ్రాజ్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆస్తులు మొత్తం తన కూతురికేనంటూ వీలునామా కూడా రాసినట్లు సమాచారం.
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
ప్రస్తుతం రామ్రాజ్ కూతురు అమూల్య కొంపల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. రామ్రాజ్ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ దిశగా కూడా విచారణ చేస్తామని చెప్పారు పోలీసులు. ల్యాండ్మార్క్ హోటల్ యజమాని కుటుంబం మృతిపై రామ్రాజ్ అన్న జగదీశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని, తమది వెల్ సెటిల్డ్ కుటుంబం అని చెప్పారు. తమకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు జగదీష్. నా తమ్ముడు ఫ్యామిలీ సూసైడ్ ఎందుకు చేసుకున్నారో.. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కంటతడి పెట్టారు.
మరోవైపు తెల్లవారు 3 గంటల 15 నిమిషాలకు రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్లో సూసైడ్ చేసుకున్నామని మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యభర్తలు ఇద్దరు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రవి. రామ్ రాజ్.. అంబర్పేట్లో ల్యాండ్ మార్క్ హోటల్, మల్లేపల్లిలో బిరియాని సెంటర్, మల్లాపూర్లో కింగ్స్ హోటల్, చక్రిపురంలో మరొక హోటల్ నిర్వహిస్తున్నారు. ఐతే ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపడితే చనిపోయారా? ఎవరైనా భయపెట్టారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
-
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..