Paragliding World Cup 2024: హిమాచల్ ప్రదేశ్లోని బీడ్ బిల్లింగ్ వ్యాలీలో నేటి (శనివారం) నుంచి పారాగ్లైడింగ్ ప్రపంచకప్ రెండోసారి నిర్వహించనున్నారు. పారాగ్లైడింగ్ ప్రపంచకప్ నవంబర్ 2 నుంచి 9 వరకు జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ బాలి టేకాఫ్ సైట్ బిల్లింగ్లో హవన్ యాగం తర్వాత ప్రారంభోత్సవం చేస్తారు. 32 దేశాల నుంచి దాదాపు 100 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. పాల్గొనేవారి…
Mandi Masjid Controversy: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని జైలు రోడ్డు మసీదు అక్రమ నిర్మాణం కేసులో ముస్లిం పక్షం స్టే ఆర్డర్ తెచ్చింది. సెప్టెంబరు 13 నాటి నిర్ణయంపై తదుపరి విచారణ జరిగే వరకు కార్పొరేషన్ ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది.
పేదరికం జీవితానికి కానీ చదువుకు కాదు. తల్లి సరస్వతిని ఆరాధించి పేదరికాన్ని అధిగమించి విజయాలు సాధించిన ఎందరో విద్యార్థుల స్ఫూర్తిదాయకమైన కథలను మీరు విన్నారు. ఇప్పుడు ఇందుకు చక్కటి ఉదాహరణగా ఓ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధిలో భిక్షాటన చేస్తూ, చెత్త కుండీల నుండి పాత ఆహారం తింటూ గడిపిన ఓ చిన్నారి నేడు డాక్టర్గా మారింది. అవును, హిమాచల్ ప్రదేశ్లోని టిబెటన్ శరణార్థుల శిబిరంలో పింకీ హర్యాన్ అనే విద్యార్థిని దేశాన్ని…
ఈ వివాదాస్పద మసీదు అంశం కోర్టుకు చేరింది. సిమ్లాలోని మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా కోర్టు ఈ రోజు ఆదేశించింది. సంజౌలీ మసీదు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసేందుకు మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా మున్సిపల్ కమిషనర్ కోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది.
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు.
56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు.
రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది.