56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు.
రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, తినుబండారాలు, ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు, నిర్వాహకుల పేర్లు, చిరునామాలను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
సంప్రదాయం పేరుతో ప్రపంచంలో ఎన్నో వింతలు చేస్తుంటారు. భారతదేశంలో కూడా వివిధ సంప్రదాయాలను అనుసరిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని పిని గ్రామంలో అలాంటి ఒక సంప్రదాయం ఉంది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.
Sanjauli mosque row: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని సంజౌలి మసీదు అక్ర నిర్మాణంపై వివాదం కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల…
Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.