AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!
- 1968లో కూలిన సైనిక విమానం
- విమానంలో 102 మంది సైనికులు
- 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం
- తాజాగా నాలుగు మృతదేహాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు. నేటికీ మృతదేహాలను వెతికే పని కొనసాగుతోంది. ఇది దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్. తాజాగా భారత సైన్యం ఇందులో మరి కొన్ని మృతదేహాలను కనుగొంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రమాద స్థలం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. 7 ఫిబ్రవరి 1968న, AN-12 విమానం చండీగఢ్ నుంచి లేహ్కు బయలుదేరింది. కానీ కొంత సమయం తర్వాత అది కనిపించకుండా పోయింది. రోహ్తంగ్ పాస్కు సమీపంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న తర్వాత విమానం కూలిపోయింది. బాధితుల మృతదేహాలు, అవశేషాలు దశాబ్దాలుగా మంచు ప్రాంతంలో కూరుకుపోయాయి. మరోవైపు డోగ్రా స్కౌట్స్ నేతృత్వంలో భారత సైన్యం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
READ MORE: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Ashwin: 'వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు'.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్కు చెందిన పర్వతారోహకులు మొదటిసారిగా 2003లో శిథిలాలను కనుగొన్నారు. ఆ తర్వాత భారత సైన్యం, ప్రత్యేకించి డోగ్రా స్కౌట్లు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రవేశించలేని భూభాగం ఉన్నప్పటికీ.. సైట్ నుంచి 2019 వరకు కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. బయటపడిన నాలుగు మృతదేహాల్లో ముగ్గురిని గుర్తించారు.
READ MORE: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
మృతదేహాలను ఎలా గుర్తించారు?
మల్ఖాన్ సింగ్, కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, థామస్ చరణ్ అనే ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఆయన జేబులో దొరికిన వోచర్ ద్వారా మల్ఖాన్ సింగ్ (పయనీర్)ని గుర్తించారు. కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ (ఆర్మీ మెడికల్ కార్ప్స్) జేబులో దొరికిన పేబుక్ నుంచి గుర్తించబడింది. అదేవిధంగా.. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME)కి చెందిన థామస్ చరణ్ కూడా ఆయన పేబుక్ నుంచి గుర్తించారు. నాలుగో మృతదేహాన్ని ఎవరిదన్న దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 10 వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది.
తాజావార్తలు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Home Tips: వర్షాలు మొదలయ్యాక ఇంట్లో ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేయండి
-
Redmi K90 Ultra: రెడ్ మీ K90 అల్ట్రా రిలీజ్.. 8,550mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్
-
Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!