AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!
- 1968లో కూలిన సైనిక విమానం
- విమానంలో 102 మంది సైనికులు
- 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం
- తాజాగా నాలుగు మృతదేహాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు. నేటికీ మృతదేహాలను వెతికే పని కొనసాగుతోంది. ఇది దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్. తాజాగా భారత సైన్యం ఇందులో మరి కొన్ని మృతదేహాలను కనుగొంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రమాద స్థలం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. 7 ఫిబ్రవరి 1968న, AN-12 విమానం చండీగఢ్ నుంచి లేహ్కు బయలుదేరింది. కానీ కొంత సమయం తర్వాత అది కనిపించకుండా పోయింది. రోహ్తంగ్ పాస్కు సమీపంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న తర్వాత విమానం కూలిపోయింది. బాధితుల మృతదేహాలు, అవశేషాలు దశాబ్దాలుగా మంచు ప్రాంతంలో కూరుకుపోయాయి. మరోవైపు డోగ్రా స్కౌట్స్ నేతృత్వంలో భారత సైన్యం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
READ MORE: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్కు చెందిన పర్వతారోహకులు మొదటిసారిగా 2003లో శిథిలాలను కనుగొన్నారు. ఆ తర్వాత భారత సైన్యం, ప్రత్యేకించి డోగ్రా స్కౌట్లు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రవేశించలేని భూభాగం ఉన్నప్పటికీ.. సైట్ నుంచి 2019 వరకు కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. బయటపడిన నాలుగు మృతదేహాల్లో ముగ్గురిని గుర్తించారు.
READ MORE: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
మృతదేహాలను ఎలా గుర్తించారు?
మల్ఖాన్ సింగ్, కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, థామస్ చరణ్ అనే ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఆయన జేబులో దొరికిన వోచర్ ద్వారా మల్ఖాన్ సింగ్ (పయనీర్)ని గుర్తించారు. కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ (ఆర్మీ మెడికల్ కార్ప్స్) జేబులో దొరికిన పేబుక్ నుంచి గుర్తించబడింది. అదేవిధంగా.. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME)కి చెందిన థామస్ చరణ్ కూడా ఆయన పేబుక్ నుంచి గుర్తించారు. నాలుగో మృతదేహాన్ని ఎవరిదన్న దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 10 వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!