AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!
- 1968లో కూలిన సైనిక విమానం
- విమానంలో 102 మంది సైనికులు
- 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం
- తాజాగా నాలుగు మృతదేహాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు. నేటికీ మృతదేహాలను వెతికే పని కొనసాగుతోంది. ఇది దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్. తాజాగా భారత సైన్యం ఇందులో మరి కొన్ని మృతదేహాలను కనుగొంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రమాద స్థలం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. 7 ఫిబ్రవరి 1968న, AN-12 విమానం చండీగఢ్ నుంచి లేహ్కు బయలుదేరింది. కానీ కొంత సమయం తర్వాత అది కనిపించకుండా పోయింది. రోహ్తంగ్ పాస్కు సమీపంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న తర్వాత విమానం కూలిపోయింది. బాధితుల మృతదేహాలు, అవశేషాలు దశాబ్దాలుగా మంచు ప్రాంతంలో కూరుకుపోయాయి. మరోవైపు డోగ్రా స్కౌట్స్ నేతృత్వంలో భారత సైన్యం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
READ MORE: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్కు చెందిన పర్వతారోహకులు మొదటిసారిగా 2003లో శిథిలాలను కనుగొన్నారు. ఆ తర్వాత భారత సైన్యం, ప్రత్యేకించి డోగ్రా స్కౌట్లు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రవేశించలేని భూభాగం ఉన్నప్పటికీ.. సైట్ నుంచి 2019 వరకు కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. బయటపడిన నాలుగు మృతదేహాల్లో ముగ్గురిని గుర్తించారు.
READ MORE: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..
మృతదేహాలను ఎలా గుర్తించారు?
మల్ఖాన్ సింగ్, కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, థామస్ చరణ్ అనే ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఆయన జేబులో దొరికిన వోచర్ ద్వారా మల్ఖాన్ సింగ్ (పయనీర్)ని గుర్తించారు. కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ (ఆర్మీ మెడికల్ కార్ప్స్) జేబులో దొరికిన పేబుక్ నుంచి గుర్తించబడింది. అదేవిధంగా.. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME)కి చెందిన థామస్ చరణ్ కూడా ఆయన పేబుక్ నుంచి గుర్తించారు. నాలుగో మృతదేహాన్ని ఎవరిదన్న దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 10 వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!