Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!
- కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన కంగనా
- రూ. 272 కోట్ల ప్రాజెక్ట్ ను ఆపాలని మంత్రిని కలవనున్నట్లు స్పష్టం
- అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం, హిమాచల్ ప్రదేశ్లోని కులులోని ఖరహల్ వ్యాలీలో బిజిలీ మహాదేవ్ రోప్వేను నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ 272 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకించడం ప్రారంభించారు. వాస్తవానికి.. బిజిలీ మహాదేవ్ రోప్వేకు వ్యతిరేకంగా గ్రామస్థులు అనేక నిరసనలు చేపట్టారు. రోప్వే నిర్మాణం వల్ల వారి ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రోప్వే నిర్మాణంలో అనేక చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలుపుతున్నారు.
READ MORE: YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను నితిన్ గడ్కరీని కలిసినట్లు కంగనా రనౌత్ తెలిపారు. ఈ విషయమై వారికి సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాజెక్టును నిలిపేంసేందకు మళ్లీ ఒక సారి నితిన్ గడ్కరీని కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. తమకు ఆధునికీకరణ కంటే తమ దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవని ఆమె తెలిపారు.
READ MORE: Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
నితిన్ గడ్కరీ శంకుస్థాపన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హిమాచల్లోని కులులోని మోహల్ నేచర్ పార్క్ వద్ద బిజిలీ మహాదేవ్ రోప్వేకు వాస్తవంగా శంకుస్థాపన చేశారు. ఈ రోప్వే ఏడాదిన్నరలో నిర్మించాల్సి ఉంది. ఈ రోప్వే నిర్మాణంతో ఒక్కరోజులో 36,000 మంది పర్యాటకులు బిజిలీ మహాదేవ్కు చేరుకుంటారని, ఇక్కడి పర్యాటకానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోప్వే ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో బిజిలీ మహాదేవ్ చేరుకోవడానికి పర్యాటకులు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రోప్వే ద్వారా పర్యాటకులు కేవలం ఏడు నిమిషాల్లో బిజిలీ మహాదేవ్ను చేరుకోగలుగుతారు. బిజిలీ మహదేవ్కు చెందిన ఈ రోప్వే మోనో కేబుల్ రోప్వేగా ఉంటుందని, అందులో 55 బాక్సులను ఏర్పాటు చేస్తామని రోప్వే నిర్మాణ పనులను నిర్వహిస్తున్న నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మేనేజర్ అనిల్ సేన్ తెలిపారు. దీని కెపాసిటీ గంటలో 1200 మందిని తీసుకువెళుతుంది. తరువాత ఈ సామర్థ్యాన్ని 1800కి పెంచుతామన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!