Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!
- కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన కంగనా
- రూ. 272 కోట్ల ప్రాజెక్ట్ ను ఆపాలని మంత్రిని కలవనున్నట్లు స్పష్టం
- అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం, హిమాచల్ ప్రదేశ్లోని కులులోని ఖరహల్ వ్యాలీలో బిజిలీ మహాదేవ్ రోప్వేను నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ 272 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకించడం ప్రారంభించారు. వాస్తవానికి.. బిజిలీ మహాదేవ్ రోప్వేకు వ్యతిరేకంగా గ్రామస్థులు అనేక నిరసనలు చేపట్టారు. రోప్వే నిర్మాణం వల్ల వారి ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రోప్వే నిర్మాణంలో అనేక చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలుపుతున్నారు.
READ MORE: YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను నితిన్ గడ్కరీని కలిసినట్లు కంగనా రనౌత్ తెలిపారు. ఈ విషయమై వారికి సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాజెక్టును నిలిపేంసేందకు మళ్లీ ఒక సారి నితిన్ గడ్కరీని కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. తమకు ఆధునికీకరణ కంటే తమ దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవని ఆమె తెలిపారు.
READ MORE: Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
నితిన్ గడ్కరీ శంకుస్థాపన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హిమాచల్లోని కులులోని మోహల్ నేచర్ పార్క్ వద్ద బిజిలీ మహాదేవ్ రోప్వేకు వాస్తవంగా శంకుస్థాపన చేశారు. ఈ రోప్వే ఏడాదిన్నరలో నిర్మించాల్సి ఉంది. ఈ రోప్వే నిర్మాణంతో ఒక్కరోజులో 36,000 మంది పర్యాటకులు బిజిలీ మహాదేవ్కు చేరుకుంటారని, ఇక్కడి పర్యాటకానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోప్వే ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో బిజిలీ మహాదేవ్ చేరుకోవడానికి పర్యాటకులు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రోప్వే ద్వారా పర్యాటకులు కేవలం ఏడు నిమిషాల్లో బిజిలీ మహాదేవ్ను చేరుకోగలుగుతారు. బిజిలీ మహదేవ్కు చెందిన ఈ రోప్వే మోనో కేబుల్ రోప్వేగా ఉంటుందని, అందులో 55 బాక్సులను ఏర్పాటు చేస్తామని రోప్వే నిర్మాణ పనులను నిర్వహిస్తున్న నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మేనేజర్ అనిల్ సేన్ తెలిపారు. దీని కెపాసిటీ గంటలో 1200 మందిని తీసుకువెళుతుంది. తరువాత ఈ సామర్థ్యాన్ని 1800కి పెంచుతామన్నారు.
తాజావార్తలు
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!