Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!
- కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన కంగనా
- రూ. 272 కోట్ల ప్రాజెక్ట్ ను ఆపాలని మంత్రిని కలవనున్నట్లు స్పష్టం
- అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం, హిమాచల్ ప్రదేశ్లోని కులులోని ఖరహల్ వ్యాలీలో బిజిలీ మహాదేవ్ రోప్వేను నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ 272 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకించడం ప్రారంభించారు. వాస్తవానికి.. బిజిలీ మహాదేవ్ రోప్వేకు వ్యతిరేకంగా గ్రామస్థులు అనేక నిరసనలు చేపట్టారు. రోప్వే నిర్మాణం వల్ల వారి ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రోప్వే నిర్మాణంలో అనేక చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలుపుతున్నారు.
READ MORE: YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు
Also Read
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను నితిన్ గడ్కరీని కలిసినట్లు కంగనా రనౌత్ తెలిపారు. ఈ విషయమై వారికి సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాజెక్టును నిలిపేంసేందకు మళ్లీ ఒక సారి నితిన్ గడ్కరీని కలుస్తున్నట్లు స్పష్టం చేశారు. తమకు ఆధునికీకరణ కంటే తమ దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవని ఆమె తెలిపారు.
READ MORE: Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
నితిన్ గడ్కరీ శంకుస్థాపన
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హిమాచల్లోని కులులోని మోహల్ నేచర్ పార్క్ వద్ద బిజిలీ మహాదేవ్ రోప్వేకు వాస్తవంగా శంకుస్థాపన చేశారు. ఈ రోప్వే ఏడాదిన్నరలో నిర్మించాల్సి ఉంది. ఈ రోప్వే నిర్మాణంతో ఒక్కరోజులో 36,000 మంది పర్యాటకులు బిజిలీ మహాదేవ్కు చేరుకుంటారని, ఇక్కడి పర్యాటకానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోప్వే ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో బిజిలీ మహాదేవ్ చేరుకోవడానికి పర్యాటకులు 2 నుంచి 3 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రోప్వే ద్వారా పర్యాటకులు కేవలం ఏడు నిమిషాల్లో బిజిలీ మహాదేవ్ను చేరుకోగలుగుతారు. బిజిలీ మహదేవ్కు చెందిన ఈ రోప్వే మోనో కేబుల్ రోప్వేగా ఉంటుందని, అందులో 55 బాక్సులను ఏర్పాటు చేస్తామని రోప్వే నిర్మాణ పనులను నిర్వహిస్తున్న నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మేనేజర్ అనిల్ సేన్ తెలిపారు. దీని కెపాసిటీ గంటలో 1200 మందిని తీసుకువెళుతుంది. తరువాత ఈ సామర్థ్యాన్ని 1800కి పెంచుతామన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!