Himachal Pradesh: హిమాచల్లో 29 వరకు కొనసాగనున్న వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: సుందరమైన హిమాచల్ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నెల 29 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. 729 రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తూ శుక్రవారం యల్లో అలర్ట్ జారీ చేసింది. కుండపోతతో హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పాటు అనేక చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఆగస్ట్ 29 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొనడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల నేపధ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని పాఠశాలలు, విద్యాసంస్ధలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Read Also: Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో
Also Read
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో కులు-మండి హైవేపై వందలాది మంది నిలిచిపోయారు. హైవేపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కులు-మండి హైవేపై చిక్కుకున్న వారిని హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస సముదాయాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు రెస్క్యూ సిబ్బంది తరలిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా, శుక్రవారం సిమ్లాలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో 729 రోడ్లు మూసివేశామని, 2,897 పవర్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. మండికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రాష్ట్రంలో ఈ నెలలో 120 మంది కొండచరియలు విరిగిపడటం మరియు ఇతర వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మరణించారు, వారిలో సుమారు 80 మంది ఆగస్టు 14 నుండి మరణించారు. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి మొత్తంగా, రాష్ట్రంలో 242 మంది మరణించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుక్కు ప్రకటించారు.
తాజావార్తలు
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!