Team India: పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు భారత్కు బిగ్ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్
Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన పాక్ ఎట్టకేలకు భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్కు ముందే అభిషేక్కు ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్కు హాజరుకాలేదు.
READ MORE: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్తో సభ్యుల హాజరు నమోదు!
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో మాట్లాడారు. “అభిషేక్కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు ఉన్నాయి. రెండు రోజుల్లో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే హ్యాండ్షేక్స్కు సైతం అభిషేక్ రాకపోవడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజులల్లో పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ ఉంది. అప్పట్లోగా అభిషేక్ కోలుకుంటాడా? ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలిసినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్కు ముందు సుందర్ జట్టులో చేరాడు. “సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఇవాళ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు,” అని తెలిపారు.
READ MORE: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!