Team India: పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు భారత్కు బిగ్ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన పాక్ ఎట్టకేలకు భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్కు ముందే అభిషేక్కు ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్కు హాజరుకాలేదు.
READ MORE: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్తో సభ్యుల హాజరు నమోదు!
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో మాట్లాడారు. “అభిషేక్కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు ఉన్నాయి. రెండు రోజుల్లో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే హ్యాండ్షేక్స్కు సైతం అభిషేక్ రాకపోవడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజులల్లో పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ ఉంది. అప్పట్లోగా అభిషేక్ కోలుకుంటాడా? ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలిసినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్కు ముందు సుందర్ జట్టులో చేరాడు. “సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఇవాళ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు,” అని తెలిపారు.
READ MORE: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!