Team India: పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు భారత్కు బిగ్ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన పాక్ ఎట్టకేలకు భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్కు ముందే అభిషేక్కు ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్కు హాజరుకాలేదు.
READ MORE: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్తో సభ్యుల హాజరు నమోదు!
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో మాట్లాడారు. “అభిషేక్కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు ఉన్నాయి. రెండు రోజుల్లో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ గోల్డెన్ డక్గా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే హ్యాండ్షేక్స్కు సైతం అభిషేక్ రాకపోవడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజులల్లో పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ ఉంది. అప్పట్లోగా అభిషేక్ కోలుకుంటాడా? ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలిసినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్కు ముందు సుందర్ జట్టులో చేరాడు. “సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఇవాళ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు,” అని తెలిపారు.
READ MORE: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!